పుట:మత్స్యపురాణము.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత్స్యపురాణము

127


దల్లిని దండ్రిని ద్యజియించువాఁడైనఁ
        బాషండవర్గసంభరితుఁడైన
నఖిలదోషాశ్రయుండైన యట్టినరుఁడు
సుస్థిరంబగు బుద్ధిచే సొంపుమిగిలి
యొక్కహరివాసరంబున నుపవసింపఁ
గలుగు నతనికి లక్ష్మీశనిలయ మనఘ.

169


గీ.

భక్తిసాధ్యుఁడైన పక్షీంద్రగమనుండు
హృదయపద్మమందుఁ బదిలముగను
నిలిచియున్నచోట గలుషితులై మర్త్యు
లెఱుఁగ రిట్టిసూక్ష్మ మింద్రియముల.

170


వ.

ఇంక నొక్కపురాతనంబగు నుపాఖ్యానంబు వినిపించెద నాకర్ణింపుము.

171


సీ.

మగధకోసలకురుమద్రాధినాథుఁడై -
        రంతిదేవుండను రాజవరుఁడు
ధర్మంబు విడిచినఁ దద్దేశములయందుఁ
        గోర్కెమై వర్షము ల్గురియవయ్యె
నదియె కారణముగ నఖిలసస్యంబులు
        ఫలవిహీనంబులై నిలువు చెడిన
నంత దుర్భిక్ష మత్యంతభీకరముగ
        నరుదేర నాప్రజ లధికమైన
దప్పి నాఁకట నత్యంతతాప మంది
సమయునప్పుడు మద్రదేశంబునందు
దానవిఖ్యాతుఁడగు విష్ణుదత్తుఁ డనఁగ
భూసురుం డుండు విత్తసంపూరితుండు.

172


గీ.

అన్నమునకు విత్తమంతయు వెచ్చించి
చిన్నమైనముడుపు చేత లేక
రూపురేఖలందుఁ జూపట్టునిజభార్య
యగుసుగంధితోడ ననియె నిట్లు.

173