పుట:మత్స్యపురాణము.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత్స్యపురాణము

125


నిద్రించి మఱునాఁడు నియతుఁడై యేకాద
        శీదినంబునను రాజీవనేత్రుం
దలఁచుచు నిమ్ముగా జలకృతస్నానుఁడై
        విమలుఁడై సంధ్యాదివిధులఁ దీర్చి
లీలతో గోమయలిప్తస్థలంబునఁ
        బద్మనాభాకృతి ప్రతిమ నిలిపి
యందు భావించి లక్ష్మీశు నావహించి
పుష్సచందనములచేత బూజ సేసి
భక్తి నైవేద్య మర్పించి ప్రస్తుతించి
యతిముదంబునం దా నమస్కృతు లొనర్చి.

160


గీ.

విష్ణుకథలచేత వితతనర్తనవాద్య
గీతనుతులు సెలఁగఁ బ్రీతితోడ
జాగరంబు సేసి చతురత నారాత్రి
గడపవలయు నిట్లు గరిమ మెఱయ.

161


వ.

అంత.

162


క.

బారసిదినమున నుచితా
చారమ్ములు దీర్చి నరుఁడు సంతసమున ల
క్ష్మీరమణార్పితముగఁ దాఁ
బారణ సేయంగవలయు భాసురచరితా.

162


గీ.

ఇది వ్రతంబు గాఁగఁ బదిలుఁడై కడఁకను
నడపనేర్చినట్టి నరవరుండు
సురలు వినుతి సేయ శోభితాకారుఁడై
చనుచునుండు విష్ణుసదనమునకు.

164


క.

తలకొని నఖముల జిదిమిన
తులసీదళములను విష్ణుదోయజనాభున్
ఫలవాంఛఁ బూజ సేయ వి
ఫలుఁడగు నానరుఁడు పాపభావుం డగుచున్.

165