పుట:మత్స్యపురాణము.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

చతుర్థాశ్వాసము


పంబునకు సాహసంబునకు సంతసించి యతనికరంబు పట్టుకొని తత్కృ
త్యంబు నివారించి యిట్లనియె.

41


క.

అనవలసిన మాటలు ని
న్నని చూచుటగాక మృత్యు వరుదెంచియు మ
ద్వనకీటము నైనను మును
కొని చంపంగలఁదె సర్వగుణగణనిలయా!

42


క.

వెఱవకుము రాజనందన
వరకీర్తిసమేత నీకు వాంఛిత మగు నే
వర మొకటి వేడ్క నొసఁగెదఁ
బరిపూర్తిగ నడుగవలయుఁ బ్రాభవ మొప్పన్.

43


వ.

అని పలికిన మునీంద్రునకు రాజేంద్రుం డిట్లనియె.

44


ఉ.

నీదయ నివ్వనానఁ బరినిష్ఠితుఁ డై విలసిల్లు నాతఁ డిం
ద్రాదులు సన్నుతింప వసుధాధిపుఁ డై విహరించు వేడుకన్
నీదయలేక భూవరుఁడు నీతిసమన్వితుఁ డైన హీనుఁ డై
ఖేదము నొందుచుం దిరుగుఁ గీర్తులు మాయఁగ భూసురోత్తమా!

45


క.

నిరుపమభవదంఘ్రిద్వయ
సరసిజములు చూడఁగంటి చర్చింపఁగ సు
స్థిరహృదయ నిత్యకరుణా
పరభాషణ యింతకన్న వరముం గలదే.

46


క.

ఆపద్ధ్వాంతముఁ జెఱుచును
బాపౌఘనివారకంబు ప్రస్తుతి సేయన్
తాపతయనిర్హరణము
మీపదసందర్శనంబు మిత్రశతాభా!

47


క.

మోహంబు నొంది తనుభో
గేహాపరవశుడ నగుచు నింద్రియములచే
దేహంబు మఱచి తిరిగితి
నాహారస్వాపమైథునాదుల పొందై.

48


క.

మానవుఁ డధ్యాసాదివి
హీనుండై ముక్తినొందు నేధర్మములన్