పుట:మత్స్యపురాణము.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత్స్యపురాణము

101


జిత్తంబు విష్ణుని శ్రీపాదములఁ జేర్చి
        యైహికభోగంబు లమర విడిచి
కీర్తిధర్మంబు లార్జించి కినుక వడక
పుణ్యుఁ డైనట్టి నరపాలపుంగవునకు
ధాత్రి రాజ్యంబు సేయఁ బంతంబు గాక
మనుట కెడ రిట్లు సేయంగ ననువుపడునె?

37


క.

తెలియవు గాక మదంబునఁ
గులసంభవు లైన రాజకోట్లకు నీచొ
ప్పలవడునె యెన్ని చూచిన
కలుషాలయహృదయ సర్వకార్యవిహీనా.

38


తరళము.

అని మునీంద్రుఁడు పల్కువాక్యము లాదరించి నపాలనం
దనుఁడు రాజ్యధనాదిమోహము తత్క్షణంబ త్యజించి సం
జనితహర్షసమేతుఁ డై యట సంపుటీకృతహస్తుఁ డై
వినయ మొప్పఁగఁ బల్కె నప్పుడు విశ్రుతంబుగఁ బుత్త్రకా!

39


క.

గురువులకుఁ దప్పి నడచిన
గురుపాతకు లైన మనుజకోట్లకు నెల్లం
బరికింప శిక్ష యెయ్యది
తిరముగ నావాక్య మాన తిమ్ము మునీంద్రా.

40


వ.

అని పల్కి తీక్ష్ణధారలుగల్లు నిశితఖడ్గంబునఁ బుండరీకుండు తనశిరంబు
ద్రుంచికొన నుద్యోగించె నప్పు డక్కపిలుండు తన్మహీకాంతుని పశ్చాత్తా