పుట:భీమేశ్వరపురాణము.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 25

గమిసిన దాసనంపుఁబువు కాంతికి డాసిన కూర్మిమట్టమౌ
కొమరున సంజయంబరము కొంగున నూన్చెఁ గుసుంభరాగమున్. 29

తే. సంజుకెంపును దిమిరపుంజంపునలుపు,
గమించి బ్రహ్మాండభాంశంబు గరము మెఱసె
పరమపరిపాకదశవృంతబంధ మెడలి,
పతనమగు తాటిపంటితోఁ బ్రతిఘటించి. 30

తే. కామినీవిప్రయోగదుఃఖమునఁ గుం దెఁ ,
జక్రవాకంబు సురనదీసైకతమునఁ
గాశికావిప్రయోగదుఃఖమునఁ గుందు,
బాదరాయణమునిసార్వభౌముకరణి. 31

శా. ఆకాశాంచలవీధుల న్నిగిడె సంధ్యారాగరేఖావళుల్
పాకోన్ముద్రిత పారిభద్రకళికాపాండిత్యవైతండికో
త్సేకస్ఫూర్జితచండతాండవరయోద్రేకారభట్యుద్భట
శ్రీకంఠస్థిరదీర్ఘపాటలజటాశ్రేణిన్ విడంబించుచున్. 32

వ. అప్పుడు బాదరాయణుండు సంధ్యాసమయంబు నిరూపించి యసురసింధుప్రవాహంబునం గాలోచితక్రియాకలాపంబులు నిర్వర్తించి యొక్క నిర్మలసైకతప్రదేశంబునం గూర్చుండి పార్వతీవల్లభుండు తనకుఁ జేసిన యవమానంబునకు నుల్లంబునం దురపిల్లుచుండె నయ్యవసరంబున. 33

క. వెల్లిగొనె నఖిలదిక్కుల, నల్లనిచీఁకటి నవాంజనప్రతిభటమై
భల్లూకపటావల్లిమ, తల్లీ విభ్రమదమై యదభ్రస్ఫురణన్. 34

సీ. గిరినికుంజములఁ గుంజరపుంజ మనుశంకఁ, గంఠీరవంబు లుత్కంఠ నెగయఁ
బల్వలంబులఁ గిరిప్రకరంబు లనుశంక, నెఱుకురాజులు విండు లెక్కువెట్టఁ
గడలిమధ్యంబునఁ గాకోల మనుశంక , జలదేవతలు భీతి సంభ్రమింప
నదములఁ గువలకాననవాటి యనుశంక , నిందిందిరశ్రేణు లెదురుకొనఁగ
తే. రజతగిరియందుఁ దాండవారంభరభస, భంగిపతితపరశ్వధపాణి వికట
కంధరారుద్ధగజకృత్తి కంథశంక , ప్రమధులకుఁ దోఁప నంధకారంబు ప్రబలె. 35

తే. ప్రబలమై యంధకారంబు బలిసియుండఁ, దారకంబులు కాంతి నెంతయును బెరసె
నీలిపుట్టంబుఁ బఱచి పై నిలిపినట్టి, వలుఁద ముక్తాఫలములతావళము లట్ల. 36

శా. శ్రీవారాణశివిశ్వనాయకగళ, క్ష్వేళామకారక్రియా
హేవాకోద్ధతిఁ జీఁకువాల్ప్రబలఁగా హేలావతీకోటిపైఁ