పుట:భీమేశ్వరపురాణము.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24 శ్రీ భీమేశ్వరపురాణము

గగనకల్లోలినీకల్లోలమాలికా, స్పాలితబాలేందుమౌళిచేత
గుటిలకుండలిరాజడకుండలాలంకార, విలసితగండమండలునిచేత
తే. ద్రుహిణపంచమమస్తకద్రోహిచేత, భీమునాథునిచే జగత్స్వామిచేత
హరునిచేత సనాథయై యతిశయిల్లు, మోక్షభోగనిదానంబు దక్షవాటి. 21

వ. అని దక్షారామమాహాత్మ్యం బభివర్ణించుచు. 22

మ. కినుకంబుట్టినయట్టి మౌనిహృదయక్లేశంబు శాంతంబుగా
మునిశిష్యప్రకరంబుతోడ గమనౌన్ముఖ్యంబునన్ ముచ్చటల్
తనియం జెప్పుచు వేల్పుటేటి నికటస్థానంబునం దుండఁగా
వనజాతాప్తుని మండలంబు దిగియె న్వారాశి దిక్సీమకున్. 23

సూర్యాస్తమయవర్ణనము

తే. అల్లనల్లన గగనమధ్యముననుండి,
వ్రాలె నస్తాద్రి కరుణసారథిరథంబు
పశ్చిమాంభోధిమారుతాస్ఫాలనమునఁ,
గేతనముమీఁదిపసిఁడికింకిణులు మొరయ. 24

క. తారాపథాంచలము డిగి, వారిజహితముండలంబు వ్రాలె నపరది
క్పారావారంబునకై , పారావతపతగపాదపాటల మగుచున్. 25

తే. కూడియొప్పారె నస్తాద్రికూటకోటి, భానుబింబంబు కన్నులపండువుగను
విశ్వనాథుని గుడిమీఁది విమలకాంతి, భాసురంబైన హేమకుంభంబువోలె. 26

క. చరమాచలశిఖరంబునఁ, దిరమై యొక్కింత తడవు దినకరుఁ డొప్పెన్
వరుణుని శుద్దాంతంబున, నువిందాక్షులకు మించుటద్దం బగుచున్. 27

సీ. సిద్ధవాహిని నీటఁ జిఱుబంతి పసుపాడి, శ్రీవిశాలాక్షి గైసేయఁదొడఁగె
మొరసె నంతర్గేహమున విశ్వనాయక, తాండవారంభ మర్దలరవంబు
మందారతరుపుష్ప మధుపానగోష్ఠికిఁ, బ్రారంభ మొనరించె భైరవుండు
కొక్కొరోకో యని కొమరసామి రథంబు, కంఠంబు సాఁచి క్రేంకారమిచ్చె
తే. మొగుడఁబాఱిన యరవిందములను బాసి
గముగములుగ మత్తభృంగములు గూడి
డుంఠివిఘ్నేశు చెక్కు లుత్కంఠఁ జేరె
నభినవంబైన యపరసంధ్యాగమమున. 28

చ. ప్రమదమదాతిరేకమునఁ బాశివిలాసవతీకదంబకం
బుమిసిన తమ్ములంపుఁగఱ యోయన నింగిలికంబు ఛాయచేఁ