పీఠిక
87
క. ప్రాజ్ఞులు వేదజ్ఞులు లో
కజ్ఞులు చేకొండ్రె గతశిఖాగాయత్రీ
యజ్ఞోపవీతనాస్తికు
లజ్ఞులు చేకొండ్రుగాక యద్వైతమజా!
శ్రీకంఠభాష్యము గూడ సన్న్యాస మావశ్యకమనుటలేదు. పాశుపతులు విశిష్టాద్వైతసిద్ధాంతమువారు. మల్లికార్జున పండితారాధ్యులవారి శివతత్త్వసార మీవిషయమును స్పష్టముగాఁ దెలుపుచున్నది :
క. వేదోక్తసదాచారా
పాదనమున నెగడునట్టి పశువులకుఁ బురా
పాదితదురితక్షయమై
యాదరమున ధర్మ మధిక మగు నీశానా!
క. ధర్మాధిక్యంబున నతి
నిర్మలబోధయు విరక్తినిష్ఠయుఁగల య
క్కర్ములకు నీ ప్రసాదము
పేర్మిని శివభక్తి పుట్టుఁ బృథుభావమునన్.
క. మానితశివభక్తి శివ
జ్ఞానధ్యానముల నీ ప్రసాదాతిశయా
నూనతఁ గర్మక్షయమై
యానందప్రాప్తి ముక్తుఁడగు నీశానా!
విశిష్టాద్వైతసిద్ధాంతమునకు జీవగఱ్ఱ యనఁదగిన శ్రుతి (నాయ మాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన, యమై వైష వృణుతే తేన లభ్యస్తస్యైష ఆత్మా వివృణుతే తనూం స్వామ్) ప్రతిపాదితమయిన యర్థమునే పయిపద్యములును జెప్పుచున్నవి.