ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0211-3 మధ్యమావతి సంపుటం: 08-063
పల్లవి:
ఎన్నిటికిఁక దయ యేడనున్నది
వన్నె చిత్తరువు వ్రాసి వనితఁజేసితివా
చ. 1:
చిత్తమెల్ల నీరాయ సిగ్గులెల్ల నెగ్గులాయ
వత్తివలె విరహాన వాడె దేహము
యిత్తల నీవెట్టఁ బొంది యెన్నఁడిఁక వడదేరు
కొత్తగా కరుగుగట్టి కోమలిఁ జేసితివా
చ. 2:
చెమ్మగించె తనువల్లి చెక్కులు చేతికివచ్చె
చిమ్మిరేఁగి పులకలచెట్లు మొలచె
తమ్మివలెఁ జెంగలించె తరి యెన్నఁడిఁక తోలు
బొమ్మకు ప్రాణమువోసి పొలఁతిఁ జేసితివా
చ. 3:
వీడెపు మోవి వెలసె వెగటులెల్లాఁ బాసె
వేడుక రతులచేత విఱ్ఱవీఁగెను
యీడనే శ్రీవేంకటేశ యింతినిట్టే కూడితివి
నీడకు చైతన్యమిచ్చి నెలఁతఁ జేసితివా