పుట:కాశీఖండము.pdf/482

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

470

శ్రీకాశీఖండము


బుద్ధిఁ గృప చేసి రక్షింపు పుణ్యసాధ్వి!
కాన! నీపేరు నాకు నిక్కముగఁ జెప్పు.

172


వ.

అనిన నమ్మత్తకాశిని సాత్యవతేయున కి ట్లనియె.

173


శా.

ఊఁకఁ జెప్పఁగ నెంత యేని తడ వౌ నోవిప్రశార్దూల! నీ
వాఁకొన్నాఁడవు భోజనోత్తరమునం దాస్థానమై యుండి య
ఱ్ఱాఁకం బెట్టక చెప్పెదన్ వినుము వృత్తాంతంబునుం దేటగా
వీక న్వేళ యతిక్రమించెఁ గుడువన్ వేంచేయుమా గ్రక్కునన్.

174


వ.

అనినం బారాశర్యుం డయ్యార్యతో నమ్మా! యొక్కవిన్నపంబు గల దాకర్ణింపు మని యి ట్లనియె.

175


తే.

అయుతసంఖ్య శిష్యు లాయాయివీథుల
వేఱువేఱ భిక్ష వేఁడితేఱ
నేను నొక్కవీథి నేకాంతవృత్తిమైఁ
బర్యటించి తెత్తుఁ బంచభిక్ష.

176


చ.

దినము దినంబుఁ దప్పకిటు ద్రిమ్మఱి చాలఁగ భిక్ష చేసియుం
జనునెడఁ గూడ వత్తురు కృశానుసమానులు నన్నుఁబైలజై
మినిముఖు లైనశిష్యులు సమిద్ధమతిం బురసూర్యవీథికిన్
మునుకొని యొయ్యనొయ్యఁ గరముం గరవల్లియునుం బఠించుచున్.

177


తే.

శిష్యులును నేను గూడి రాజీవనేత్ర!
యాశ్రమమునఁ బాషాణమఠాంతరమున
రాశి వోయుదు మఖిలపాత్రికలయందు
నందఱును దెచ్చినట్టి భిక్షాశనముల.

178


సీ.

పాయసాపూపాదిపక్వాన్ననివహంబు
        లేకీభవించిన నేర్పరించి