పుట:కాశీఖండము.pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

469


తే.

అభ్రగంగ నుపస్పర్శ మాచరించి
వేగ విచ్చేయవలయు నావిభుఁడు దసిలి
యాఁకటికి నోర్వలేఁడు బ్రాహ్మణవరేణ్య!
యర్కమండల మిదె వ్రాలె నపరదిశకు.

168


వ.

అనిన వేదవ్యాసుండు ముత్తైదువ కి ట్లనియె.

169


తే.

కమలలోచన! కిన్నరాంగనవె నీవు
నీవు గంధర్వభామవే నీలవేణి?
యప్సరస్స్త్రీవె నీవు బింబాధరోష్ఠి!
రమణి! నీవు విద్యాధరరాజసుతవె!

170


సీ.

కల్యాణి! నిన్ను నీకాశీపురములోన
        నెన్నండుఁ గాన నీ వెవ్వరమ్మ?
నిన్ను దర్శింపంగ నిఖిలేంద్రియములకు
        నత్యంతసంతృప్తి యావహిల్లె
రాహుదంష్ట్రాంకురక్రకచఘట్టనభీతి
        జగతి కేతెంచినచంద్రకళవె?
నన్ను రక్షింపంగ నాపాలఁ గల్గిన
        భాగ్యదేవతవొ తప్పదు నిజంబు


తే.

ఒండెఁ గైవల్యలక్ష్మివి యొండె నీవు
కామినీత్వంబుఁ గైకొన్న కాశిపురివె?
యొండె నాకొన్నవారల నూఱడించి
యమృతభిక్షాన్న మిడువిశాలాక్షి వీవు.

171


తే.

చేయఁగలవాఁడ నేను నీ చెప్పినట్ల
బ్రాహ్మణుఁడఁ గాన నాకుఁ జాపలము ప్రకృతి