పుట:కాశీఖండము.pdf/466

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

454

శ్రీకాశీఖండము


శా.

‘ఎట్టెట్టూ! వినమైతి మింక నొకమా ఱేర్పాటుగాఁ జెప్పుమా
భట్టారా!’ యని నందికేశ్వరుడు విస్పష్టంబుగాఁ బల్కిన
న్బట్టెన్ గంఠబిలంబు చెయ్యి దివియ న్రాదయ్యె వారాణసీ
హట్టప్రాంగణమందు వ్యాసునకు శిష్యశ్రేణి భీతిల్లఁగన్.

108


క.

భుజవాక్సంస్తంభంబునఁ
బ్రజనితభయుఁ డగుచు ముట్టఁబడి మదిఁ దలఁచెన్
గజరాజవరదు గరుడ
ధ్వజుఁ డప్పుడ యరుగుదెంచె వ్యాసునికడకున్.

109


వ.

వచ్చి ‘యో బాదరాయణుండ! బుద్ధిమంతుండ విట్టియపరాధం బెట్టు సేసి?’ తని కినిసి, ‘నందికేశ్వర! నాకుం బ్రియంబుగా నీతని(యపరాధంబు క్షమించి) కరుణార్ద్రదృష్టిం జూడు’మని వేడుకొనియె. అప్పుడు సత్యవతీవందనునకు వాగ్భుజాస్తంభనంబులు నివర్తిల్లె. కృష్ణద్వైపాయనుండును బహుప్రకారంబులం బరమేశ్వరుం బ్రస్తుతించి తనపేర వ్యాసేశ్వరలింగంబుఁ బ్రతిష్ఠించె. ఆలింగంబును దన్ను భజించువారలకు భోగమోక్షప్రదాయకుండై యుండు. అనిన విని కుంభసంభవుండు శంభునందనున కభివాదనంబు సేసి సవినయంబుగా నిట్లనియె.

110


సీ.

శైలారి వాగ్భుజాస్తంభం బొనర్చుట
        నజ్ఞానవిరహితుం డయ్యె నేని
భాగీరథీతటోపాంతస్థలంబున
        లింగప్రతిష్ఠఁ గల్పించె నేని
పుణ్యపంచక్రోశభూతీర్థమహిమంబు
        నెరవుగా సర్వంబు నెఱిఁగె నేని