పుట:కాశీఖండము.pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

459


నేతెంచి శిష్యులును దాఁ
బ్రాతఃకాలమున కాలమునఁ బొగడఁ బద్మేక్షణునిన్.

104


వ.

లక్ష్మీశ్వరుండె దైవంబు, జనార్దనుండె భుక్తిముక్తిప్రదుండు, విష్ణుధర్మంబె ధర్మంబు.

105


సీ.

సత్యంబు భుజగేంద్రశయనుండె దైవంబు
        సత్యంబు దైవంబు చక్రధరుఁడు
సత్యంబు వైకుంఠసదనుండె దైవంబు
        సత్యంబు దైవంబు శాశ్వతుండు
సత్యంబు కైటభశత్రుండె దైవంబు
        సత్యంబు దైవంబు శార్ఙ్గధరుఁడు
సత్యంబు వార్ధిజాసహితుండె దైవంబు
        సత్యంబు దైవంబు శ్యామతనుఁడు


తే.

మఱియు సత్యంబు దైవంబు మాధవుండు
మఱియు సత్యంబు దైవంబు మదనగురుఁడు
మాట లేటికి? దైవంబు మఱియుఁ గలఁడె
పుండరీకదళాయతాక్షుండు దక్కె.

106


వ.

అని యీప్రకారంబు వారణాశియందుఁ బంచనదంబునం బావనోదకంబులం దీర్థం బాడి యాదికేశవదేవుం బాంచరాత్రదివ్యాగమమార్గంబున నర్చించి విశ్వేశ్వర శ్రీమన్మహాదేవుభవనద్వారంబున నిల్చి దక్షిణభుజం బెత్తి సకలవేదపురాణేతిహాససిద్ధాంతనిశ్చితార్థంబు, సత్యంబు, పునస్సత్యంబు, వేదశాస్త్రంబులకంటెఁ బరం బైనజ్ఞానంబును, గేశవులకంటె బరం బైనదైవంబు లే దని పలికిన విని.

107