పుట:కాశీఖండము.pdf/463

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

451


చ్చలమున రోహశీరమణుచారుశనముఁ దత్పదాహతిం
గలిగిన కుందుగాదె పొడగానఁగ నయ్యెడు నేఁడు చిహ్నమై?

94


తే.

ఈశ్వరద్రోహి! గర్వాంధ! ఋషిసురేంద్ర
బంధునాశైకకారణ! పాపకర్మ!
చావు మని యొక్కపెట్టునఁ జక్రధార
దక్షుతలం ద్రెవ్వగొట్టె ఫాలాక్షసుతుఁడు.

95


వ.

ఇవ్విధంబున మధుమధనుచక్రాయుధంబు విఱిచి, జంభాంతకు భుజాస్తంభంబు సంస్తంభించి, భృగునికన్నులు కెలికి, పూషుపండ్లు పెఱికి, మఖమృగంబుశిరంబు ఖండించి, దక్షుతల ద్రెవ్వవ్రేసి, దాక్షాయణిసుతుఁ బొట్టగు జ్జుఱుక ద్రొక్కి, భారతీదేవిముక్కు చిదిమి, గాలివధ్యంబు చేసి, జమునిమెడ దండె పగిల్చి, యదితియధరపల్లవంబు చక్కడచి, యగ్ని నాలుకలు గోసి, నిరృతి దలపట్టి వంచి, కింపురుషపతి మొగంబు పాషాణపట్టంబున బిట్టు రాచి, యనంతరంబ గరుడులంద్రోచి, ఖచరులఁ బొరకొట్టి, యచ్చరల సిగ్గువుచ్చి, కిన్నరులఁ దునిమి, గుహ్యకుల గోడుకుడిపి, సాధ్యులం జెఱిచి, రుద్రులం బఱపి, మరుత్తులఁ ద్రోపించి, విశ్వుల వేఁచి, విద్యాధరుల వెలిచి, గంధర్వుల గారించి, యక్షుల నధిక్షేపించి, చక్షుశ్శ్రవుల శిక్షించి, చారణుల జంకించి, కింపురుషులఁ బరిభవించి, వీరభద్రుండు మాఱులేక మలయుచుండె. నివ్విధంబున.

96


ఉ.

తామరసాసనుం డగు పితామహు కూరిమిపట్టి యైనమా
తామహు యాగతంత్రమునఁ దంత్రము చేసి శివాజ్ఞ విక్రమో