పుట:కాశీఖండము.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

405


తే.

అనిమిషారాతి విల్లెత్త నగజ ద్రుంచె
శూల మెత్తిన ఖండించె నీలవేణి
పఱియలుగఁ జేసె గద యెత్త భద్రకాళి
ఖడ్గ మెత్తిన జక్కాడెఁ గంబుకంఠి.

245


మ.

వడి వింధ్యాచలగండశైలములఁ ద న్వైవంగ నేతెంచుచో
నుడురాజార్ధశిఖావతంసుసతి యత్యుగ్రంబు వహ్న్యస్త్రమున్
దొడి దుర్గాసురు నేయ వాఁడు వడియెన్ దుర్వారవజ్రాహతిన్
బడుశైలంబును బోలి మెచ్చిరి హరిబ్రహ్మాదిబృందారకుల్.

246


వ.

అప్పుడు “దేవీ! జగద్ధాత్రీ! జగత్రయీజననీ! మహేశ్వరమహాశక్తి! దైత్యద్రుమకుఠారికా! త్రైలోక్యవ్యాపినీ! శివా! శంఖచక్రగదాశార్ఙ్గధారిణీ! విష్ణుస్వరూపిణీ! హంసయాన! సర్వసృష్టివిధాయినీ! అనాదినిధనవాగ్జన్మభూమి! చతురానన! ఐంద్రీ! కౌబేరీ! వాయవీ! వారుణీ! యామినీ! నైరృతి! ఐశీ! పావకీ! శశాంకకౌముదీ! సౌరీ! సర్వదేవమయీ! పరమేశ్వరీ! గౌరీ! సావిత్రీ! గాయత్రీ! సరస్వతీ! ప్రకృతీ! మతీ! అహంకృతీ! బ్రహ్మాండాంతస్థమహాదేవీ! పర! పరాపరపరమ! పరమాత్మస్వరూపిణీ! సర్వస్వరూప! సర్వగ! చిచ్ఛక్తిమహామాయ!స్వాహా! స్వధా! శ్రౌషడ్వౌషట్స్వరూపిణీ! ప్రణవాత్మిక! సర్వమంత్రమయీ! చతుర్వర్ణాత్మిక! చతుర్వర్గఫలోదయ!” యని యిట్లనేకప్రకారంబుల దేవతలందఱు ప్రస్తుతించిరి. భద్రకాళియు నిర్జరుల కభీష్టవరంబులు ప్రసాదించె. దుర్గాసురుని మర్దించి జగంబులదుర్గతి మాన్పుటం జేసి భర్గుగృహిణికి దుర్గాభిధానంబు గలిగె. దుర్గాదేవి గాశీక్షేత్రంబునందు నుపసర్గాదిదోషంబులు మాన్చు. దుర్గా