పుట:కాశీఖండము.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

401


కుంభినీధ్రసన్నిభాకారులు కుఠారభిండివాల మండలాగ్ర త్రిశూలపట్టినప్రాసతోమరంబులు ధరియించి యమ్మహాదేవిం జుట్టుముట్టి పట్ట నురవడించిన.

227


మ.

ఘనరౌద్రోద్ధతి భద్రకాళికకటాక్షజ్యోత్స్న కెంపార ను
హ్హని వక్త్రంబు బిగించి యూఁదుటయు నుల్కాగ్నిచ్ఛటల్ గ్రమ్మ వె
చ్చని జంఝాపవమాన ముప్పతిలి రక్షఃకోటి నొక్కుమ్మడిన్
గొనిపోయె న్వినువీధిఁ జొప్పసొరువాకుంబోలె నెందేనియున్.

228


తే.

పగర నిబ్బంగి శతకోటిఁ బాఱ నూఁది
కఠినహాసం బొనర్చి యాకాళరాత్రి
యరిగె నాకాశవీథి వింధ్యాద్రిసీమ
కసురయును శక్తి వెంటాడి యరుగుటయును.

229


తే.

అంబరక్షోణిచక్రమధ్యమున నుండి
కోటి కోటి నిశాటులు గొల్చి నడువఁ
గాళరాత్రి మహాశక్తి గదిసి వెంట
నేగుదెంచె దుర్గాసురుం డేకధాటి.

230


వ.

అప్పుడు శతకోటిరథంబులు నర్బుదశతద్వయగజంబులు గోట్యర్బుదహయంబులు నసంఖ్యాతయోధులుం గొలువ నేతెంచుదుర్గాసురునిముందట బృందారకమార్గంబున నిరర్గళాటోపంబున నేతెంచు కాళరాత్రిని దవ్వుదవ్వులం గనుంగొని మహాభుజసహస్రదివ్యాయుధయు మహాతేజోపబృంహితయు మహాఘోరప్రహరణపరంపరాధగధ్ధగితధామచ్ఛటాచ్ఛాదితాంబరయుఁ బ్రోద్యచ్చండమార్తాండమండలసహస్రకాంతిజ్యోతిశ్చక్రమధ్యవర్తినియు లావణ్యవార్ధిసమృద్ధి