పుట:కాశీఖండము.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

358

శ్రీకాశీఖండము


తే.

రఖిలమాయాప్రయోగవైయాత్యగరిమ
డుంఠివిఘ్నేశ్వరుండు వైకుంఠపతియుఁ
గమలవాసినియును నేకకార్యపరత
నాదివోదాసు వెడలంగ నడచుటయును.

94


శివుండు సపరివారుండై కాశి కేతెంచుట

వ.

అనంతరంబు విదితదివోదాసవృత్తాతుండై యంతకదమసుం డంబికయును మహాకాళవిశాఖనైగమేశులు రుద్రులు ప్రమధులు దేవర్షులును దిక్పాలురుం గొలిచి చనుఁదేరఁ గిన్నరకింపురుషగరుడగంధర్వసిద్ధవిద్యాధరులు జయజయధ్వనులతోడం గైవారంబులు సేయ నందివాహనారూఢుఁడై మందరనగంబుననుండి యానందకాననంబునకు విజయంబు చేసి యవిముక్తమంటపంబునం బేరోలగంబుండి తత్కాలసన్నిహితు లైనయోగినీభానుపద్మభవప్రమథలక్ష్మీనారాయణుల యథాప్రధానంబుగా సంభావించి డుంఠివిఘ్నేశ్వరు గంఠా(గాఢా)లింగనంబు చేసి గండస్థలంబున నఖాంకురవ్యాపారంబునం బుజ్జగించుచు ని ట్లనియె.

95


సీ.

నీకతంబునఁ గాదె లోకభీకరు లైన
        త్రిపురదానవుల మర్దింపఁ గలిగె!
నీకతంబునఁ గాదె కాకోలవిషవహ్ని
        యలవోకయును బోలె నార్పఁ గలిగె!
నీకతంబునఁ గాదె నిరవగ్రహస్ఫూర్తి
        నంధకాదులగర్వ మడఁపఁ గలిగె!
నీకతంబునఁ గాదె నేఁడు వారాణసీ
        సంగమోత్సవకేళి సలుప గలిగె!