పుట:కాశీఖండము.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

357


జనంబుల రావించి కుమారు సమరంజయు నందఱికి నప్పగించి యతనికిం బట్టాభిషేకంబు సేసి కాశికానగరంబునందు దనసర్వశ్రీసమృద్ధియు వెచ్చించి మహాప్రాసాదంబు నిర్మించి యందు శివలింగంబుఁ బ్రతిష్ఠించి కింకిణీజాలమండితం బైనదివ్యవిమానం బెక్కి శరీరంబుతోడన శివలోకంబునకుం జనియె. ఆప్రాసాదంబు సర్వశ్రీసమృద్ధివినియోగనిర్మితంబు గావున భూపాలశ్రీ యనం బ్రసిద్ధి గాంచె. దివోదాసేశ్వరలింగంబు భాగీరథీతీరంబున భజించువారికి భుక్తిముక్తిప్రదాయకం బయి ప్రకాశించె. ఇది దివోదాసవృత్తాంతంబు. ఈయుపాఖ్యానంబు విన్నను బఠించిన లిఖించిన జనుల కాయురారోగ్యైశ్వర్యాభివృద్ధి యగు నని చెప్పి కుమారుండు వెండియు కుంభసంభవున కి ట్లనియె.

92


చ.

కరివదనుండు నిందిరయుఁ గైటభవైరియుఁ బెక్కుమాయల
న్ధరణిపుఁ గాశికాపురమునం బెడఁబాపి పినాకపాణికిం
బరమసముద్యమస్ఫురణఁ బంపిరి లేఖలు సర్వకార్యమున్
గరగరనయ్యె రమ్ము శశిఖండశిఖామణి! యంచు భక్తితోన్.

93


సీ.

సంతోషమునఁ జతుష్షష్టిగణంబు
        నామోదవృత్తంబు నభినయించె
సరవి లోలార్కకేశవఘటోల్కాదులు
        పన్నిద్దఱు ప్రమోదభాజు లైరి
వనజాసనుఁడు నాల్గువదనంబుల నుతించె
        వేదార్థముల భక్తి విశ్వనాథు
గణనాయకులు శంకుకర్ణఘంటాకర్ణ
        నందిషేణాదు లానంద మొంది