పుట:కాశీఖండము.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

313

శ్రీకాశీఖండము


పక్వంబు గానేరదు. పరిపక్వాన్నంబు లేక వైశ్వదేవబలిహరణాదిక్రియాకలాపంబులు కుంఠితంబు లగు. హవ్యకవ్యక్తియాశూన్యు లైనబ్రాహ్మణులు రాజులయందు విరక్తు లగుదురు. బ్రాహ్మణులు విరక్తు లైనప్పుడ తక్కినవర్ణంబుల ప్రజలు వైరాగ్యంబు వహింతురు. ప్రజా(ను)రంజనంబునంగదా రాజు రాజౌట. ప్రజావిరక్తిఁ గోశదుర్గబలాదిసప్తాంగంబులు పరిక్షీణంబు లగు. సప్తాంగపరిక్షయంబునఁ ద్రివర్గనాశనం బగు. త్రివర్గనాశనంబున నుభయలోకమార్గంబును ఖిలీభవించుంగావున.

298


తే.

మొదల వైశ్వానరుని నిజమూర్తిశక్తి
సంహరింపంగఁ దగుఁ గాశి జనపదమున
నగ్ని లేకున్న నోగిరం బనువుపడక
రాజు ప్రజలును నెబ్భంగి బ్రదుకువారు.

299


ఉ.

చండకరాన్వయాంబునిధిచంద్రుడు భూమణుం డతండు ఱా
గుండియవాఁడు వేలుపులకోటు లసంఖ్యలు భూతధాత్రిపై
నుండఁగ నీక కాశిపురి నొక్కఁడు రాజ్యము సేయు టెట్టు? లీ
దండికి మెచ్చి నారట ప్రతాపవిహీనుఁడు భూమిపాలుఁడే?

300


తే.

అనిన నాచార్యుపలుకుల నాదరించి
యింద్రుఁ డనుపఁగ ధాత్రికి నేగె నగ్ని
మొదలఁ గాశీపురమునకు ముట్టముణఁగ
సకలగృహములఁ దినమూర్తి సంగ్రహించె.

301


మ.

కర మాశ్చర్యముగా బ్రతిక్షయమునం గాష్ఠంబులం దగ్నిదే
వర నిప్పచ్చరమై యడంగుటయు సర్వస్త్రీలు పాకక్రియా