పుట:కాశీఖండము.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

293


సంధ్య వార్వంగ వలయు నిచ్చలును నిష్ఠ
నర్ఘ్య మీఁ దగు నర్కోదయంబునపుడ.

206


సీ.

సౌభాగ్యమేధాప్రసాదసంపన్మహో
        త్సాహోదయములకు జన్మభూమి
నవరంధ్రములయందు స్రవియించురోఁతచే
        శుచి గానిమేనికి శుద్ధికరము
తేజంబు గల్పింప దీర్ఘాయు వొనరింప
        జాలు వాసరముఖస్నాన మనఘ!
యరుణోదయమున మూర్ధాభిషేక మొనర్చి
        తగును జేయఁగ మంత్రతంత్రవిధులు


తే.

స్నానమున కంగకములు మృత్సంచయంబు
నక్షతంబులు దిలలు దర్భాంకురములు
గోమయంబును బావమానీముఖంబు
లైనఋఙ్మంత్రములును వింధ్యాద్రిదమన!

207


వ.

విశుద్ధం బైన మృత్పిండంబు శుచిప్రదేశంబునం బెట్టి యుదఙ్ముఖుండును బద్ధబ్రహ్మశిఖుండును నై యద్దేవతాకంబు లైన మంత్రంబు లుచ్చరించుచు సలిలావగాహనంబు చేసి.

208


క.

నేమం బొప్పఁగఁ బ్రాణా
యామం బొనరించునది జలాంతరమున లో
పాముద్రాధిప! ప్రాణా
యామంబు శ్రుతిప్రసూతయజనం బనఘా.

209


తే.

మొదలి తుదియోంకృతులతోడ మూర్ధ మగుచు
వ్యాహృతులు మూఁటి నాల్గింటి నధిగమించి