294
శ్రీకాశీఖండము
| మంత్రరాజంబు గాయత్రి మహిమ నొప్పుఁ | 210 |
వ. | గాయత్రిత్రివారజపంబు ప్రాణాయామంబు, గాయత్రిదశవారజపంబు తపంబు. జలాంతరమున గాయత్రీత్రివారజపం బొండె [1]విష్ణుసంస్మరణం బొండెఁ జేయునది. స్నానానంతరంబ కారుణ్యపితృప్రీతికరంబు వస్త్రనిష్పీడనం బొనర్చునది. ఇది స్నానవిధానంబు. | 211 |
క. | ధౌతపరిధానపరుఁడై | 212 |
వ. | అనంతరంబ గాయత్రీజపం బాచరించునది. | 213 |
తే. | పగలు నిలుచుండి జపియించు నిగమమాత | 214 |
వ. | ఈప్రకారంబునన మధ్యాహ్నకాలంబునను బ్రహ్మవిష్ణుమహేశ్వరుల నింద్రాదిదిక్పాలకుల మరిచ్యాదిమహర్షుల మన్వాదిమనువుల సలిలతర్పణంబులం దృప్తిం బొందించునది. చందనాగరుకర్పూరగంధోన్మిశ్రితంబు లగుజలంబులు తర్పణార్హంబులు. దైవం బార్షంబు బ్రాహ్మంబు పైతృకం బనుతీర్థకంబుల దేవాదితర్పణంబులు నాచరించునది. | 215 |
- ↑ ప్రణవత్రివారజపం బొండె