పుట:కాశీఖండము.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

222

శ్రీకాశీఖండము


గవిశుక్లం బయి తత్క్షణంబున నిజాకారంబుఁ దాల్చె న్మనో
భవవిద్వేషి నిజాత్మసంభవునిఁ గా భావించి వీడ్కొల్పె భా
ర్గవు నాతండు దపంబు సేయ నరిగెన్ గాశీపురీసీమకున్.

239


వ.

అరిగి యానందకాననంబున లింగప్రతిష్ఠ చేసి యాలింగంబునందు విశ్వేశ్వర శ్రీమన్మహాదేవు భావించుచుఁ జంపక దత్తూత కరవీర కుశేశయ మాలతీ కరణికార కదంబ వకుళోత్పల మల్లికా శతపత్త్ర సింధువార కింశు కాశోకపున్నాగ నాగకేసర క్షుద్ర మాధవీ పాటలా బిల్వ మందార ద్రోణ గ్రంధిపర్ణి దమన చూతపల్లవ దర్భ తులసీ నంద్యావర్త దేరదారు కాంచన దూర్వాంకురాదుల శంకరు ననేకకాలం బారాధించి శుక్రుఁ డీలోకంబుక కధీశ్వరుండయ్యె.

240


క.

వారాణసి శుక్రేశ్వరు
నారాధించిన వరుండు ప్రాపించు సమ
గ్రారోగ్యాయుఃపుత్త్ర
శ్రీరాజ్యైశ్వర్యశౌర్యచిరసౌఖ్యంబుల్.

241


అంగారకలోకవృత్తాంతము

వ.

అట నూర్ధ్వంబున నున్నయది లోహితాంగలోకంబు.

242


సీ.

తొల్లి దాక్షాయణితోఁ బాసి శంభుండు
        మహసంతాపాగ్ని వేఁగుచుండె
నావేళ నొక్కనాఁ డభవుఫాలంబునఁ
        బ్రస్వేదబిందు వుత్పన్న మయ్యెఁ
బరిపక్వకూశ్మాండఫలసన్నిభం బైన
        యాఘర్మజలకణం బవని వ్రాలె