పుట:కాశీఖండము.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

223


వ్రాలి తత్క్షణమ యవ్వసుమతీస్థలమునఁ
        బద్మరాగోపలప్రతిమకాంతి


తే.

నొక్కదివ్యకుమారుఁడై యుండె నెదుర
నతని నందను గాఁ శంభుఁ డాదరించె
ధాత్రియును వాని భావించెఁ దనయు గాఁగ
నతఁడు ధృతిమెయి దుము సేయంగఁ గోరి.

243


సీ.

భాగీరథీగంగ ప్రవహించు నేవీటి
        పరిసరంబున కుదగ్భాగమునను
వరణాతరంగిణీవార్నిర్ఝరములతో
        నసి(ళి)వేణి యేవీటియవధిఁ గూడెఁ
దప్తంబు హుతమును దత్తంబు నేవీటి
        యైదుక్రోసుల నిచ్చు నమృతలక్ష్మి
వలచు నేవీటి కవ్యాజరాగస్ఫూర్తి
        శైలకన్యకకంటెఁ జంద్రమౌళి


తే.

యట్టి కాశికి గురునాజ్ఞ నరుగుదెంచి
పరమనైష్ఠికుఁ డగుచుఁ దపం బొనర్చెఁ
గలుషసంతానకాననాంగారకుండు
ధారకుఁడు భూతధాత్రి కంగారకుండు.

244


తే.

పాంచముద్రమహాస్థానపదమునందుఁ
గాశి శాశ్వతదేశోపకంఠభూమి
నిష్ఠ నంగారకేశుఁ బ్రతిష్ఠ చేసి
కాంచె నీలోక మేల నంగారకుండు.

245


వ.

ఇది యంగారకలోకవృత్తాంతంబు.

246