పుట:కాశీఖండము.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

211

చతుర్థాశ్వాసము


నాయకుఁ డయ్యెఁడు నని దా
క్షాయణులకు వరము నీలకంఠుం డొసఁగెన్.

189


వ.

వెండియు సమస్తజ్యోతిశ్చక్రంబునడుమ నగ్రగణ్య లయ్యెదరు. మేషాదిరాసులకుం గారణంబు లయ్యెద రాదోషాధీశ్వరుండు బ్రాహ్మణాధిపతి యైనతారకాపతికిం బత్ను లయ్యెదరు. మీచేతం బ్రతిష్ఠితం బైననక్షత్రేశలింగంబు భజించువారలకు భోగమోక్షప్రదం బయ్యెడు. మృగాంకలోకంబునకు మీలోకం బూర్థ్వలోకంబు గాఁగలయది. సర్వతారకామధ్యంబున మీరు మాన్య లయ్యెద రని యానతిచ్చి శివుం డంతర్హితుం డయ్యె. ఇది తారకాలోకవృత్తాంతం బనిన విని యనంతరంబ ముందట బుధలోకంబుఁ గనుంగొని.

190


బుధలోకవృత్తాంతము

సీ.

ప్రతిబింబమో గాని రజనివల్లభున క
        ధ్యాహారమో కాని యమృతరుచికి
వినిమియంబో కాని విధున కన్వాదేశ
        మో కాని యత్రి నేత్రోద్భవునకు
వీప్సయో కాని పూవిలుకానిసఖునకు
        నామ్రేడితమొ కాని యుబ్ధిజునకు
నభిధాంతరమొ కాని యరవిందవైరికి
        సారూప్యమో కాని చందురునకు


తే.

ద్రుమికి నూడ్చినవాఁడు భర్గునికిరీట
కోటి కాభరణం బైన కువలయాప్తు
మిగులఁ జక్కనికొడకండు మింటినడుమ
గ్రహములం దీతఁ డెవ్వండు? గణములార!

191