పుట:కాశీఖండము.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

శ్రీకాశీఖండము


పాత్రావలోకనోపాయంబునకు నైన
        వెలయించె దీపంబు వెలుఁగఁ బాఱఁ
జూడనొల్లక యైనఁ జూచె నీశ్వరుమౌళి
        బరులు చేసినయట్టి ప్రసవపూజఁ


తే.

జచ్చె విధి మూడి యైనను జంధ్రధరుని
నగరిమోసాలఁ బెంద్రోవనట్టనడుమ
సూక్ష్మదృష్టి విచారించి చూచినప్పు
డింతకింటెను ధర్మంబు లెవ్వి గలవు?

133


వ.

అని పారిషదులు యమదూతల వీడ్కొలిపి యతని దివ్యవిమానారూఢుం జేసి శివలోకంబునకుం గొనిపోయి శివునిసన్నిధిం బెట్టిరి. శివుండును బ్రదీపతేజస్సంధులక్షణాదికపుణ్యానురూపం బైనఫలంబునం గళింగదేశాధిపతి యైన
యరిందమునకుఁ దనయుండై దముం డనుపేర నాదేశంబునకు రాజుగా ననుగ్రహించి పుత్తెంచె. ఈశ్వరానుగ్రహంబునం బట్టాభిషిక్తుండై.

134


క.

చాటించెఁ గళింగేంద్రుఁడు
వీటను దేశమున శంభువేశ్మంబులలోఁ
బాటించి దీపకళికా
గోటు లసంఖ్యములు మెండుకొని యుండుటకున్.

135


క.

ఇలువరుసఁ జంద్రశేఖరు
నిలయంబున దీపకళిక నిలుపనివారిన్
దలఁ ద్రెవ్వఁగ వ్రేయుం డని
తలవరులం బంచె రాజు తనదేశములన్.

136


వ.

దీపికాదానపుణ్యప్రభావంబున నక్కళింగాధిపతి జన్మాంతరంబు