పుట:కాశీఖండము.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

157


        దండత్రయము బహూదకుఁడు దాల్చె


గీ.

భసిత ముద్ధూళనము చేసి పాశుపతుఁడు
దీర్ఘపాటలజటల బంధించె మౌళిఁ
గలుమఠంబులమీఁద శృంగములనడుమఁ
గొక్కొరోకో యనుచుఁ గోడి కూయుటయును.

237


వ.

అంత సూర్యోదయంబున.

238


సీ.

ధరణీధరములందు ధాతుపాషాణంబు
        పాదపంబులయందుఁ బల్లవంబు
పాథోనిధులయందుఁ బవడంపులేఁదీఁగ
        కాలాభ్రములయందుఁ గోలమెఱుపు
హరిదంతనాగంబులందు సిందూరంబు
        భూమిమండలియందు హేమభూష
యాకాశవీథియం దబ్జవందనమాల
        నబ్జజాండగృహంబునందు దివియ


గీ.

యగుచు బాలాతపము జగం బాక్రమింప
నంధకారము దిక్కుల నస్తమింప
భానుబింబంబు దోఁచెఁ బ్రభాతలక్ష్మి
కబరిభారంబుమీఁద చెంగలువకచ్చు.

239


వ.

అయ్యవసరంబున విశ్వానరుండు సకలకలికలుషవిషభంగజాంగలికం బగుగగనగంగాప్రవాహంబున నఘమర్షణస్నానం బాచరించి, విరజానలసంభవం బైనభస్మంబున సర్వాంగోద్ధూళనం బొనర్చి, తిర్యక్పుండ్రంబు లురశ్శిరోబాహుమూలంబుల ధరియించి, రుద్రాక్షమాలికాధరుండయి సరస్వతీస్కందవిఘ్నేశ్వరులకు నాదిత్యానిలాగ్నులకు మ్రొ