పుట:కాశీఖండము.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

శ్రీకాశీఖండము


యామ్నాయములకంటె నభ్యర్ధితంబులు
        చర్చింప నుషనిషత్సముదయములు


తే.

నుపనిషత్తులకంటెసు నూర్ధ్వపదవి
మంత్రరాజంబు గాయత్రి మహిమఁ గాంచుఁ
బ్రణవ మనుక్రేపుతోఁ గూడి పాఁడిఁ బిదుకు
నవనిసురులకు గాయత్రి యనెడిసురభి.

181


తే.

మంత్రములలోన గాయత్రి మహిమఁ గాంచు
నగరములలోనఁ గాశి యున్నతి వహించు
దైవతంబులలో సుధాధామమౌళి
విశ్వనాథుండు ప్రాధాన్యవిభవ మొందు.

182


స్రగ్ధర.

గాతారం త్రాయతే నాఁగలిగినతెలివిన్ గల్గె గాయత్రి కర్థా
న్వీతం బై నామధేయం బితరమనువులం దీప్రభావంబు లే దీ
ప్రాతర్మధ్యాహ్నసాయోపగమములఁ బరబ్రహ్మవిద్వాంసు లార్యుల్
జ్యోతిర్మూర్తిన్ భజింతు ర్సురగణవినుతున్ సూర్యునిన్ సిద్ధవిద్యన్.

183


క.

గాయత్రి పరబ్రహ్మము
గాయత్రి కధీశ్వరుండు కమలాప్తుఁడు శ్రీ
గాయత్రీమంత్రమునకు
నేయవియును సాటి వచ్చునె మంత్రమ్ముల్?

184


వ.

ఈ వేదమూర్తి హంసుండు, భానుండు, సహస్రాంశుండు, తపనుండు, తాపనుండు, రవి, వికర్తనుండు, వివస్వంతుండు,