పుట:కాశీఖండము.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

137


తన్మధ్యమందున ధవళాంశుశేఖరు
        నుద్గీతవిద్యాప్రయోగసరణి
హైమరూపుఁడు హిరణ్యశ్మశ్రుకేశుండు
        నానాప్రముఖహిరణ్యానయవుఁడు
గాగ భాగించి యాకమలలోచనుఁ డుండు
        నతఁడ యే నని సదా ధ్యానపరత


తే.

విమలమానసుఁ డగుచు భావింపవలయు
బ్రహ్మవిద్వాంసుఁ డగువాఁడు ప్రాహ్ణవేళ
నర్కునర్ధోదయమున గాయత్రిఁ గూర్చి
యర్ఘ్య మెత్తిన యాచమనాంతరంబు.

179


వ.

కాలలోపంబు సేయవలదు. కాలంబు ప్రతీక్షించునట్టిది. కాలంబునం గదా యోషధులు ఫలించు. కాలంబునం గాక పాదపంబులు పూచునే? కాలంబుననే మేఘంబులు వర్షించు. మందేహదేహనాశార్థం బుదయాస్తమయంబుల బ్రాహణోత్సృష్టంబగు గాయత్రీమంత్రతోయాంజలిత్రయంబు చిత్రభానుం డపేక్షించుచుండు. కాలంబు దప్పకుండ సదుపాస్యమానం డయి భానుం డాయురారోగ్యైశ్వర్యంబులు ప్రసాదించు.

180


సీ.

మే లైన రెండుతొమ్మిదులు విద్యలలోన
        మననీయ మగుచు మీమాంస వెలయ
మీమాంసకంటెను మిగులుప్రాభవమునఁ
        దర్కశాస్త్రము శుభోదర్కగరిమ
తర్కశాస్త్రముకంటెఁ దా నమభ్యధికంబు
        వివరించి చూడంగ వేదరాశి