పుట:కాశీఖండము.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92 శ్రీ కాశీఖండము


        హిమశైలకన్యకాధీశుఁ గొల్చి
పద్మాద్రిపై రుద్రపాదంబు లర్చించి
        చేరి మార్కేండేయశివు భజించి
కోటిపల్లీతీర్థకుండలాముఖముల
        నర్ధేందుధరు విరూపాక్షుఁ దలఁచి


తే.

పల్వెలస్థానమున భూతభర్త నిలిపి
కాంతమున వృద్ధగంగలోఁ గ్రుంకువెట్టి
దక్షవాటిక సప్తగోదావరమున
మునిఁగి భీమేశ్వరునిఁ గాంచె మునివరుండు.

16


శా.

ప్రాతఃకాలము తీవ్రభానుఁ డుదయింపన్ సప్తగోదావరీ
స్రోతఃపూరమున న్మునింగి యభవున్ సోమార్ధచూడామణిన్
జ్యోతిర్లింగమయస్వరూపుఁ గొలిచెన్ శుద్ధాంతరంగంబునన్
బాతివ్రత్యమహాప్రభావనిధి లోపాముద్ర భీమేశ్వరున్.

17


మ.

మునిచూడామణి యెల్లసత్కళలకున్ మూర్ధాభిషిక్తుండు గా
వునఁ జారీకరణాంగహారముల ఠావుల్ మించి కీర్తించుచున్
శనివారోత్సవవేళఁ గన్గొనియె నాస్థానంబునన్ రాజనం
దనయుం దానును దేశిమార్గమున గంధర్వాప్సరోనృత్తముల్.

18


వ.

అంత.

19


తే.

కుంభజుఁడు దక్షిణాభిముఖుం డగుటయు
నదను వీక్షించి వచ్చెనో యనఁగ వచ్చె
శంబరారిప్రతాపాగ్నిసామిధోని
నవశరద్వేళ శ్రీభీమనాథుఁ గొలువ.

20


తే.

జిగురుకొన్న రజస్స్ఫూర్తిఁ జెఱఁగుమాసి
జలజకుండోదకంబుల జలకమాడి