పుట:VrukshaSastramu.djvu/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వుచు రైతులమ్ముకొను చుండిరి. వీరిట్లు కల్తి గల్పుట చేతను ధరలలో హెచ్చు తగ్గులు వచ్చుట చేతను, ఈ యల్లరి పడలేక ఈష్టు ఇండియా కంపెని వారు నల్లమందు వ్యాపారము తామె భరింప వలసిన వారైరి. వారను హేస్టింగును వేలముల పద్ధతి పెట్టెను. దాని మూలమున నొక వర్థకుడొక పొలమును 4 వేలకో 5 వేలకో వేలము పాడి పండించు పండించుమని. రైతులను బాధ పెట్టుచు వచ్చెను. కాని రైతునకు లాభమంతగా నుండమిచే నిర్లక్ష్యముచేయుచు వచ్చె, వ్యాపరము తగ్గెను. ఇట్టి బాధల తగ్గించుటకై ఎట్టకేలకు గవర్నమెంటు వారు నల్ల మందు వ్యాపారమంతయు దాము స్యయముగానే యంగీకరింప వలసిన వారైరి. నల్లమందుకు బ్రమత్తుని జేయు గుణము గలదు. నూనె మొదలగు కొన్ని పదార్థములతో దిన్నచో మరణమును సంభవించును. కనుక, మన శ్రేయస్సును గోరి గవర్నమెంటు వారీ నల్ల మందునందరికంద నీయక దానిపై ఎక్కువ పన్ను విధించిరి. కాని నల్లమందు పై నెట్టి నిభందన లేకున్నను దానినిష్టపడి తినువారు ఇంఘ్లాండు దేశములో మైమరచి త్రాగుచున్న యంత మంది యుండరని గొందరి నమ్మకము. ఏదేశమైనను మన మూలమున మన గవర్నమెంటు వారికి గలిగెడు లాభ నష్టముల నెరుంగుట మంచిది.