పుట:VrukshaSastramu.djvu/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

266

య్యెను. చదువుకొనుటకు బాలురన్య పట్టణములకు బోయి యిచ్చట దీనికి చిక్కువడుత యొక ముఖ్యకారణము.

క్వినైను చెట్లను దెచ్చి మనదేశములో మొలిపించి వానిలో జాల రకములు గలవు. కాని యేవియు విస్తార ఉష్ణమును భరింప లేవు. కావున మన దేశమునందు కొండల మీదనే వానిని పెంచు చున్నారు. ఈ చెట్లు పచ్చిక బయళ్ళలో కంటె అడవులు నరికి, అచ్చట పాతినచో బాగుగమొలచును. అవి పెరుగు నేలలందు నీరు నిలిచి యుండ రాదు.

ఈ చెట్లను కొమ్మలు పాతి యైనను గింజలను నాటియైనను బెంప వచ్చును. మళ్ళు చేసి,ఎండ తగులకుండ పందిరియో, పాకో వేసి విత్తనములను ఒత్తుగ జల్లుదురు. వానికి తరుచుగా నీరును బెట్టు చుండ వలెను. అవి ఆరు వారముల నాటికి మొలకెత్తును. ఈ లేత మొక్కలు రెండు మూడాకులు వేసిన తరువాత వానిని దీసి రెండేసి అంగుళముల దూరములో పాతి పెట్టవలెను. ఇవి నాలుగు అంగుళములెత్తు ఎదిగిన పిమ్మట నైదేసి అంగుళముల దూరమున బాత వలెను. తొమ్మిది... పదంగుళములు ఎదిగిన పిమ్మట వానిని మరల దీసి రకమును బట్టి నాలుగు మొదలు ఆరడుగుల దూరములో పాత వలెను.

మొక్క లెదిగి ఒక దానికొకటి మిక్కిలి దగ్గరగా నున్నను నష్టము లేదు. అంత దగ్గరగా నుండుట వలన వానిక్రిం