పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20


యితరులతో చెప్పి వ్రాయించెడి వారు. ఇక మాతృభాష యైన తెలుగు పాండిత్యము కూడ పై భాషలవంటిదే. వారది కూడ నేర్చుకున్నవారు కారు. వారు చాలన్యాయము గాను, ప్రజాను రంజకము గాను, తమ ఉద్యోగ ధర్మమును నెరవేర్చిన వారని ప్రతీతి. రాయచూరు మహబూబునగరము జిల్లాలలోని వృద్ధ జనులు నేటికిని వారి సౌజన్యమును గురించి చెప్పుకొను చుందురు.