పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

37


నైనకద్దా? యనెను. వికటకవి 'ప్రభూ! తామనుగ్రహించి, మంత్ర మూలమున మంగలిని బ్రాహ్మణునిగా జేయుటలేదా? అదివిచిత్రము కాదా మంగలి ద్విజుండగుటయే తటస్థించునేని యీ శునకము తప్పక గోవగును సందియము లే'దనెను,

తన యవివేకమును దెలియజేయుటకే రామకృష్ణు డిట్టి పన్నాగము బన్నెనని గ్రహించి, రాయలు మంగలిని పిలిచి 'ఓయీ! నీవు బ్రాహ్మణ్యము నెట్లును బొందజాలవు నీకు వలయునది మరేదియైన గోరుకొనుము' అని చెప్పి, యంతఃపురమునకు బోయెను.


22 పింగళి సూరన్న

రామకృష్ణకవి రాయలు తదితరులు నాస్థానమున నుండగా యొకనాడు 'భార్య సద్గుణవతియైనచో బురుషునకు బ్రసిద్ది--మంచి బేరువచ్చునుగదా! యనెను, పింగళసూరన్న 'ఆహా! ఎంతగొప్పగా సెలవిచ్చినావు? భార్యగుణవతియైయుండి భర్త దుర్మార్గుడైనచో, భర్తకు గీర్తియెట్లు కలుగును? ఇరువురును గూడ సద్గుణశాలురై యున్నచో గీర్తికలుగుట వాస్తవము' అనెను----

'అవును నీవు రాఘవపాండవీయములో వ్రాసికొనినట్లు చెప్పుచుందువు. నీకవిత్వమునే బలపరచుకొనుచుందు' వని రామకృష్ణుడనగా, రాయలు “దానికిని దీనికిని సంబంధ మేమున్న?' దనెను, రాసుకృష్ణకవి 'ఆర్యా! ఇదిగో యీతడు వ్రాసిన పద్యము.

సుతుని దౌష్ట్యముచే, బలాత్కారముచే ధృతరాష్ట్రుడుకుమారుని మార్గమునే యనుసరించినను, సతియగు గాంధారి సౌజన్యము వలననే కీర్తి కాముడయ్యెను.