పుట:Sinhagiri-Vachanamulu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

59

వారు ఆవేదనపడ్డారు. అయినా సమకాలికులైన పదకర్తల బాణీలను, నాటి సంగీత రంగధోరణులనూపట్టీ వారు తాళ్ళపాకవారి పదాలకు స్వరకల్పనం చేసినట్టు చెప్పినానారు. కృష్ణమాచార్యుల విషయంలో ఆమాత్రం అవకాశమూ ఉన్నట్టు కనపడ్డంలేదు. దండెయు, చిఱుతాళంబులు పూని కీర్తించినట్లు తాను చెప్పినందువల్ల ఈ వచనకీర్తనలు రాగతాళ సమన్వితాలే అయి ఉంటాయి. ప్రస్తుతానికీసంప్రదాయం మనం కోల్పోయేమనుకోకతప్పదు. తిరుమల తిరుపతిదేవస్థానంవారు ప్రకటించిన తాళ్ళపాక పెద తిరుమలాచార్యుల వైరాగ్య వచన మాలికా గీతాల్లాగ రాగభావం ప్రకటించటానికి వీలుగా కనీసం వాక్యాంతంలో ఏకతాళ పద్ధతిని తాళం కొట్టటానికి వీలుగా వింగడింపుతో ఈ వచనాలు పునర్ముద్రణం జరగాలి. ప్రస్తుత ముద్రణంలో కూడా ఈ పద్ధతి పాటించటం కుదరలేదు కారణాంతరాలవల్ల.

వచనాల రకాలు - కొన్ని ఉదాహరణలు

ఛందోబంధ విరహితాలైనా కృష్ణమాచార్యుల వచనాల్లో పదలక్షణమూ గద్యకు మరీ ఆవశ్యకమూ అయిన తూకం కనపడుతుంది. ఈ వచనం చిత్తగించండి.——

దేవా శ్రీ రామానుజ సిద్ధాంతమునుబోలు
           మఱి సిద్ధాంతము లేదు
పరమాచార్యులంబోలు
           మఱియాచార్యులు లేరు
పరమభాగవతులంటోలు
           మఱి భాగవతులు లేరు
వారి కైంకర్య పరులంబోలు
           మఱి కైంకర్యపరులులేరు
అస్మద్గురుభ్యోనమః అను మంత్రమునకు
           సరి మంత్రంబు లేదు
పరమ రహస్యంబునుంబోలు
           మఱి రహస్యంబు లేదు