పుట:Sinhagiri-Vachanamulu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

“నీ మహత్వంబు దెలియ బ్రహ్మరుద్రాదులును బ్రహ్లాదనారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాం రుక్మాంగడ విభీషణాది పుణ్యానిమాంపరమ భాగవతులుమిమ్ము నుతియింపలేరు" అని ఉంది. ఈ తెలుగు సంస్కృతాల "ఘోరకలి" ఎబ్బెట్టుగా కాని అనన్వితంగా కాని, సంస్కరణీయంగా కాని, కవ్యుద్దీష్టం కాకపోవచ్చునని కాని పరిష్కర్త లకు తోచినట్లు లేదు. ఇక్కడ అసలు పొరపాటు సమర్ధులుకాని వ్రాయసకాండ్రది. 'ప్రహ్లాద నారద' అని కనపడగానే తమకు వచ్చిన శ్లోకమే అన్న దృష్టి పెట్టుకొన్నారుకాని ఆ శ్లోకంలోని భాగవతుల "పేర్ల పట్టీలు మాత్రం గ్రహించి అంతవఱకూ అవసరం అయిన సమాసాల్నే కవియిక్కడ వాడుకొంటున్నాడన్న వివేకం వారికిలేదు. అంచేత యీ పొరపాటు జరిగింది. 'ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశౌనక భీష్మ దాల్భ్య రుక్మాంగద విభీషణాది పుణ్యులైన పరమ భాగవతులు' అని ఉంటే బాగుంటుంది. 8వ వచనంలోనూ ఇట్లాంటి పొరపాటే జరిగింది.

“మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన రామో రామరామశ్చ బౌద్ధకల్కి దశావతారా" అని ఉంది. ఇది ఎంత అనన్వితం.! శ్లోకంలో ఉన్న పది పేర్లనూ తోరణంగా కూడా సమాసం కూర్చలేనివారా కృష్ణమాచార్యులు ! ఇదీ వెనకటిలాగే 'వ్రాత గాళ్ళ' పొరపాటే కావచ్చును. ఇదే భావం 39వ వచనంలో “మత్స్యకమఠ వరాహ నారసింహమూర్తి వామన జామదగ్ని రామ దశరథరామ రామ కృష్ణ బుద్ధకల్క్యావతారా" అని ఏక సమాసంగా ప్రకటిస్తారు. అయితే సమాసం చివర యణాదేశంలో దీర్ఘం పొరపాటు. 'కల్క్యవతార' అని ఉండాలి.—— ఈ దృష్టితో ప్రస్తుత ప్రతిని వీలయినంతవరకు పరిష్కరించి ముద్రిస్తున్నాం. కాని చేయవలసింది యింకా చాలా ఉంది.

సింహగిరి వచనాలు-రాగతాళానుగుణ ముద్రణావావశ్యకత

తామ్రపత్రికల్లో రాగనిర్దేశంచేసినా తాళనిర్దేశం లేకపోవటం వల్ల తాళ్ళపాకవారి పదసంకీర్త నవిధానం తెలియకపోతోందని శ్రీమాన్ రాళ్ళపల్లి