పుట:Sinhagiri-Vachanamulu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

ములసహ్యములు, -అని ఉంది కృష్ణమాచార్యుల ధోరణిని బట్టియిక్కడ- పల్లవములుకు బదులు 'పరిమళములు' ఉంటే బాగుంటుంది. మరో ప్రతితో సంప్రతించి కాని నిర్ధారణ చెయ్యలేం. 20వ వచనం లో

“భాగవతులు ధన్యాత్ములు. జాయమీశ స్వరూపులు" అని ఉంది. ఇది అనన్వితం. వాల్తేరు లిఖితప్రతిలో(సం)యమీశ స్వరూపులు అని ఉంది. యోగీశ్వరులన్న అర్ధంలో ఈ పూరణమే బాగుంది. లేకపోతే జాయదీశ స్వరూపులు' కావాలి. కాని వ్రాతప్రతిలో యమీశ స్పష్టంగా కనపడు తున్నందువల్ల ఇది సంయమీశ స్వరూపులే కావచ్చును. 21వ వచనంలో

“ఈ విధంబున జగంబునఁజతుర్విధరూపంబుల (?) దాల్చి" అని ఉంది. ఇక్కడ చతుర్విధ రూపాలంటే డాక్టరుగారు ఆశ్చర్యం ప్రకటించేరు. శ్రీరంగం, వేంకటాచలం, శ్రీ జగన్నాధం. సింహాచలం. ఈ నాలుగు క్షేత్రాలయందూ కృష్ణమాచార్యులకు సమాన ప్రతిపత్తి . శ్రీ పరమపదవాసుడే ఈ నాలుగు స్థలాల్లో నాలుగు రూపాలతో ఉన్నాడని ఆయన విశ్వాసం. మిగతా ముగ్గురితోనూ శ్రీపరమపదవాసుడితోనూ సింహాద్రినాయుడికి అభేదమే ప్రకటిస్తారాయన. "శ్రీరంగశాయి శ్రీపరమపద నివాసుండు శ్రీ జగన్నాధుండు సింహాద్రియప్పడు” అంటున్నారాయన. అంచేత 'చతుర్విధరూపంబుల' పట్ల ఆశ్చర్యం అక్కరలేదనుకొంటాను. 25వ వచనంలో

“ఆ చోరుండప్పుడా గ్రహముతో నరువదియేండ్లు మంటిరత్నమున దోగినను తుమ్మ దుడ్డునకు" అని ఉంది. ఇది అనన్వితం. ఇక్కడ ఆధోజ్ఞాపికలో "మన్నుతో కూడిన రత్నములందు" అని అర్ధము కావచ్చుమ" అని డా. రావుగారు సూచించేరు. కాని యిక్కడ వాల్తేరు లిఖితప్రతిలో “అరవై యేండ్ల మట్టిరక్తాన దోగిన తుమ్మదుడ్డుకు" అని ఉంది. పట మలని పరిణామాన్ని గుర్తిస్తే పంచమ్యర్ధకమైన 'పట్టిగా' ఇది తేలుతుంది. మట్టిమైన (పట్టి, పైన) వంటిరూపాలు వ్యవహారంలో ఉన్నాయి. రక్తంలేక