పుట:Sinhagiri-Vachanamulu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

55

“ఎంబెరుమాళ్ళస్వరూపులైన తదీయులు, నదబెరుమాళ్ళ స్వరూపులైన స్వాములు" అని వర్ణించినట్లు ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఉన్న వ్రాత ప్రతిలో ఉంది. ముద్రిత ప్రతిరో రెండు విశేషణాలకి బదులు ఎంబెరుమానార్ల స్వరూపులైన స్వాములు' అన్న ఒక్క విశేషణమే ఉంది. వ్రాతప్రతిలోని మొదటి విశేషణాన్నే 'ఎంబెరుమానార్లు'గా సంస్కరించి ఉంటారు రావుగారు. 'తదీయులు' రాలేదు. తదీయులంటే భాగవతులనీ అర్ధం. ఇక రెండోది..'నడబె రుమాళ్ళు 'తెలుగు సరస్వతికి కృష్ణమాచార్యులుకై చేసిన చూడామణి యిది. దీన్ని తొలగించేరు శ్రీరావుగారు. 'నడఁగొండ' లాంటిది యీ సమాసం. జంగమ దైవ స్వరూపులని అర్ధం. శైవంలోని జంగమదేవరలకు ప్రతిగా ఉన్నారు వీరని యీ విశేషణం సూచిస్తోంది. దీనివల్ల ఈ పొతకమూరి భాగపతులు చాత్తాద వైష్ణవులనే ఊహకూ అవకాశం కలగకపోదు. దీనికి తోడు వారి పేర్లలో ఆచార్యశబ్దంలేకుండా అందరూ “అయ్యలు'గానే ఉండటం ఇందుకుపష్టంభకంగానే ఉంది. అబ్రాహ్మణులపట్ల ఆచార్యులవారి అదరావి కిచి మరో ఉదాహరణ కావచ్చును. ఇంట్లాటి వాటివల్లనే పాపం ఆయనా ఆయన వ్యాజ్మయమూ కూడా “వెలి' శిక్షననుభవించటం.

18 వ వచనంలో

"పరమరహస్య కారియగు పురుషా కార ప్రపన్నుని తప్పులెన్నుదురు" అని ఉంది. ఇది ఆకర్తృకమై ఆధ్యాహార్యకర్తృకం కావాలి. వాల్తేరు లిఖిత ప్రతిలో 'ద్రష్టలెన్నుదురు'అని ఉంది. ఇలా ఊంటేనే అన్వయం చక్కగా ఉంటుంది. 'ప్రపన్నుని'కి బదులు 'ప్రసన్నుని' ఉంది లిఖిత ప్రతిలో-ఇప్పుడం వ్యయంచూడండి-పరమరహస్యం అంటే చరమశ్లోకం. పరమరహస్యకారి చరమార్ధ ప్రదాత. పురుషాకార ప్రసన్నుడు- లీలామాసుష విగ్రహుడై సాక్షాత్కరించినవాడు- ద్రష్టలు ఋషులు ఎన్నుదురు-కీర్తింతురు. లీలామానుష విగ్రహుబై చరమార్ధ ప్రదాత అయిన పరమేశ్వరుణ్ణి ఋషులే కీర్తంచగలరు. లౌకికులు ఆయన్ని గుర్తించనేలేరు అని యిక్కడి తాత్పర్యం 19వ వచనంలో

'మీ పాదయుగళ పరిమళ మెఱ్గిగినవారికి చందన ఘవసార పల్లవ