పుట:Shodashakumaara-charitramu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

59


వ.

అని వినుతించినం బ్రసన్న యై యాజగన్మాత సోదరునిం బతిని బ్రతికించెద నయ్యిరువురశిరంబులు దేహంబులఁ గదియింపు మనిన సంతసిల్లి యంధకారంబున నెఱుంగక.

57


గీ.

మగనిబొంది నన్నమస్తకం బొనగూర్చి
యన్నశిరము మగని నంటఁగూర్పఁ
దలలు వీడువడినతనువులతో వారు
జీవకలితు లైరి దేవికరుణ.

58


వ.

అని కథఁ జెప్పి వేతాళుండు నరేంద్రా వీరిలోన నింతికిం బతి యెవ్వఁ డగు నని యడిగిన నవ్వుచు సకలేంద్రియంబులందును శిరంబు ప్రధానం బగుటఁ బతిశిరంబువాఁడు పతి యగు ననిన వేతాళుం డెప్పటియట్ల తరువున కరిగిన మగుడం బట్టి తెచ్చునప్పుడు వేతాళుం డతని యాతాయాతంబుల డస్సితివి యే నడుగుప్రశ్నంబుల కుత్తరంబులు సెప్ప నీవ కాని యెవ్వరు నేర రింక నొక్కకథ విను మని యిట్లనియె.

59


(8) దేవసేనచరిత్రము

క.

మును వీరబాహుఁ డనియెడు
మనుజేశ్వరువీట రూపమహిమోన్నతుఁ డై
పెనుపొందెను ధనవంతుం[1]
డను వైశ్యకుమారుఁ డుజ్జ్వలాకారమునన్.

60


గీ.

అతఁడు దేవసేన యనియెడుకన్యక
యౌవనాభిరామ నసమధామఁ
జూచి మన్మథాస్త్రశోషితహృదయుఁ డై
యాత్మలోనఁ దాప మగ్గలింప.

61
  1. ధనదత్తుఁడు, ధర్మదత్తుఁడు - అని యీకధలోనే కలదు.