పుట:Shodashakumaara-charitramu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

షోడశకుమారచరిత్రము


ఉ.

దానికిఁ దల్లడిల్లి వసుధామరవర్యుఁడు జ్ఞానిఁ జూచి యే
మైనది నాతనూజ యని యడ్గిన నింతకము న్నదృశ్యుఁడై
దానవుఁ డొక్కఁ డింతిఁ గొని తద్దయు వీఁకను వింధ్యభూమి భృ
త్కాననభూమి సొచ్చె ననఁగా విని యెంతయు సంభ్రమంబునన్.

40


మ.

వెఱవార న్వెసనేగుతే రొకటి యావిజ్ఞాని గావింప సు
స్థిరశౌర్యం బెసఁగంగ శూరవరుఁ డాతే రెక్కి వింధ్యావనీ
ధరకాంతారము సొచ్చి యుగ్రగతి నాదైత్యేంద్రునిం దాఁకి
భీకరబాణంబుల వానిఁ ద్రుంచి వడి నాకన్యామణిం దెచ్చినన్.

41


తే.

కరము ముదమంది పుత్రికఁ గౌఁగిలించి
తగిన పెండిలికొడుకుల ముగురఁ గాంచి
మువ్వురును నుపకారు లీముగురయందు
దగినవరుఁ డెవ్వఁడని చింతఁ దగిలియుండె.

42


క.

అని కథచెప్పి నరేంద్రా
ఘను లాముగురందు విప్రకన్యావరణం
బున కెవ్వఁడర్హుఁ డనుటయు
జననాయకుఁ డిట్టు లనియె సరసత మెఱయన్.

43


ఉ.

ఆరసి జ్ఞానదృష్టిఁ గమలానన యున్నెడఁ జెప్పినాతఁడుం
దేరు ఘటించి నాతఁడు మదిం బరికింపఁగఁ గన్యరాకకుం
గారణమాత్రముల్ దనుజఘస్మరుఁడై వరవర్ణిఁ దెచ్చె నే
పారఁగఁ గాన శూరుఁడ మహార్హుఁడు కన్య వరింప నావుఁడున్.

44


క.

ఘనరయమున వేతాళుఁడు
చని తరు వెక్కుటయ వెంటఁ జని పతి మగుడం