పుట:Shodashakumaara-charitramu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

షోడశకుమారచరిత్రము


టెఱిఁగి నాఁ (డది యెఱుఁ)గుట యిచ్చ మెచ్చి
యధిపుఁ డతని నారీచంగుఁ డని నుతించె.

17


క.

సంగతసప్తాస్తరణో
త్తుంగం బగుపాన్పు ప్రియముతో నిడి శయ్యా
చంగు శయనింపఁ బనిచిన
సంగం బాశయ్యఁ జేర్చి యాక్షణమాత్రన్.

18


క.

ఒడ లొత్తె ననుచు వాఁ డెలుఁ
గడరఁగ వాపోవుచును రయంబున నాయి
ల్వెడలి చనుదేర భూపతి
యడుగుచు నాశ్చర్య మంది యంగ మరయఁగాన్.

19


వ.

ఏడుపఱుపులక్రింద నున్నవెండ్రుక యొత్తిన.

20


క.

ఒడల వలయంబులాంఛన
మడరఁగ నొకరోమ మొత్తి యరుణచ్ఛవి నే
ర్పడి యునికి సూప నచ్చెరు
వడి శయ్యాచంగుఁ డనుచుఁ బ్రస్తుతి చేసెన్.

21


క.

ఈవిధమున నవ్విభుఁ డా
మూవురయంతరము నరసి మోదంబున సం
భావించి యిష్టధసములు
భావ మలర నిచ్చుటయును బరమప్రీతిన్.

22


వ.

భోగపరాయణు లై యానగరంబున నుండి రంత నక్కడ.

23


క.

తనయాగము మానినఁ ద
జ్జనకుఁడు భార్యయును దానుఁ జాల నియతిమై
ననశవదీక్షాపరతం
దనువు దొరఁగి సురనికేతనంబున కరిగెన్.

24