పుట:Shodashakumaara-charitramu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

58


వ.

అని కథ చెప్పి యీముగురయందు జనకుమరణం బెవ్వరిం జెందు నని యడిగిన.

25


సీ.

ప్రకటంబుగా నేడుపఱుపుల క్రిందట
        నున్నట్టి వెండ్రుక యొత్తినట్టి
యత్యంతభోగి శయ్యాచంగుఁ బొందదు
        కమఠంబుఁ బట్టనికడిఁదియఘము
మేలుఁ గీడు నెఱుంగఁజాలెడునట్టి త
        ద్జ్ఞులుగాని యెంతయు సుఖులుగారు
గాన భోజనచంగకామినీచంగుల
        యాగవిఘ్నంబున నైనయఘముఁ
దల్లిదండ్రులు గడచిన తద్దురితము
పొందు ననిన నదృశ్యుఁ డై భూజమునకు
వీఁక వేతాళుఁ డరిగిన వెంట నరిగి
బలముమీఱఁగఁ బట్టి భూపాలసుతుఁడు.

26


వ.

మగిడి చనఁ దొడంగిన నింక నొక్కకథ విను మని వేతాళుం డిట్లనియె.

27


(6) జ్ఞానవిజ్ఞానశూరుల కథ

సీ.

సురపురిజయిని నాఁ బరఁగునుజ్జయిని ము
        న్బుణ్యసేనుం డను భూవిభునకుఁ
జాలనిష్టుఁడు హరిస్వామి యన్విపుండు
        వినుతచరిత్రుఁ డై పెనుపునొందు
నతనికి వేదవేదాంగపారగుఁడు దే
        వస్వామి యనియెదు వరసుతుండు