పుట:Shodashakumaara-charitramu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

51


భ్రాజితశాల్యోదనమును
భోజనచంగునకు మోదమునఁ బెట్టుటయున్.

10


క.

అన్నంబు కమరువలచుచు
నున్నది భోజనము సేయ నొల్ల ననుచుఁ దా
నున్ననఁ దొలంగి వచ్చిన
నన్నరపతి కారణంబు నరయించుటయున్.

11


వ.

పితృవనక్షేత్రంబునం బండిన ధాన్యంబున నైనయన్నం బిది యన్నెలవు ప్రేతధూమావృతం బగుటచేతం గమరువలచెడి ని ట్లెఱుంగునే యని కొనియాడి వాని భోజనచంగుంగా నిశ్చయించి.

12


గీ.

ఒప్పు గలుగుదాసి నొక్కతెఁ జందన
మాల్యపట్టవస్త్రమండనములఁ
జెలువు మీఱునట్లు చేసి నారీచంగు
పాల నుండు మనుచుఁ బంచుటయును.

13


వ.

అది డగ్గఱిన నాసుభగుండు దానియొడలు మేఁకగదురు వలచుటయును నాక్షణంబ.

14


గీ.

ముక్కు మూసికొనుచు మునుకొని రోయుచుఁ
జాల నేవ పడుచు శయ్య డిగ్గి
యిట్టికష్టకాంత నెందును గానము
వెదకి యనిన మనుజవిభుఁ డెఱింగి.

15


వ.

ఆదాసిం బిలిపించి యిట్టికంపు వచ్చుటకుం గారణం బేమి యని పరికించి.

16


గీ.

జనని కడచిన నత్యంతశైశవమునఁ
గోలె నది యొక్క మేఁకచ న్గుడిచి పెరుఁగు