పుట:Shodashakumaara-charitramu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

షోడశకుమారచరిత్రము


క.

వేయింటికి నీవ మనో
నాయకుఁడవు మేదినీశనందన యని తా
నాయుజ్జ్వలదామంబును
నాయఱుతం బెట్టె నాననము వికసిల్లన్.

78


క.

ఆలలన తాన కట్టిన
మాలిక ధరియింపఁ దద్రమణికరముల గా
ఢాలింగన మొనరించిన
యాలా గొందుటయు సుఖమయాత్ముఁడ నైతిన్.

79


వ.

అ ట్లత్యంతమోదాయత్తచిత్తుండ నై యన్నాతి నన్ను వరియించు నని యున్నంత.

80


క.

జగతీపతి తన పుత్రికి
దగువరుఁ డని యొక్కరాజతనయునకుఁ దగ
న్మృగనేత్ర నిచ్చువాడై
యగణితశుభలగ్ననిశ్చయము సేయుటయున్.

81


క.

అమ్మాట పిడుగుమ్రోఁత వి
ధమ్మునఁ గర్ణములు వగులఁ దాఁకుటయును ను
ల్లమ్ము గడుఁ దల్లడిల్లఁగఁ
గ్రమ్మడు విరహాగ్ని సైఁపరాక తరలఁగన్.

82


వ.

అత్తఱి మదిరావతి పుత్తెంచినపరిచారిక యొక్కతె యరుగుదెంచి న న్నూఱడించి యబ్బోటి తనయాడినమాటలు విను మని యి ట్లనియె.

83


ఉ.

భూమివరుండు తన్ను నొకభూపకుమారున కిచ్చునంచు నీ
వేమియుఁ జింతఁ బొందవల దీక్రియ నిన్న వరింతు నెంతయుం