పుట:Sakalaneetisammatamu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యుద్ధదానప్రకారము

క. ఏనుఁగులమీఁద నతిజవ
యానంబులమీఁద నైన యర్థం బెల్లన్
బూని పతియొద్ద నిడునది
మానుగ నర్థంబ రాజ్యమహిమ దలంపన్. 853

క. నూతనకృత్య మొనర్చినఁ
బ్రీతుండై నృపతి యాధబృందము నర్థ
వ్రాతమునఁ దనుపవలయున్
దాతకుఁ బ్రాణంబు లీఁడె తక్కటిజనుఁడున్. 854

సీ. ఆజిలోపల రిపురాజుఁ జంపిన
వాని కొగి నియుతార్థ మీనోపుచుండు
(దానలో నర్థంబు తత్పుత్రు జంపిన
సేనాపతి వధింపఁజెల్లునంతె
పదివేలు వీరాధిపతి జంప సగ మందు
నేనుఁగైన రథంబు నైనఁ గూర్చి
నాశ్వికాధీశ్వరు నడఁగింప నొకవేయు
నందర్థ మాశ్వికహతికి నీగి
ఆ. నగుఁ బదాతిముఖ్యు నాజిలో మార్కొని
బారిసమర మాఱు పణము లీయ)
నితరజనులఁ దలకు నిరువదియును
వారి భోగ మినుమడింప నీగి యొప్పు. 855

ఆ. యుగ్యహేమరూప్యయోగ్యభోగములను
మఱియుఁ దగినయట్టి మహితవస్తు
సమితి నిచ్చి యోధజనులచిత్తం బిగు
రొత్తఁ జేయవలయు నుచితవృత్తి. 856

ప్రయాణవ్యసనపరీక్ష

క. మకరవ్యూహం బొండెను
వికటాస్యం బైన యట్టి వీరాననసూ
చికయైనఁ బన్ని చనునది
ప్రకటితశౌర్యమున నెదుర భయ మొదవునెడన్. 857

క. వెనుక భయ మైన శకటము
దనరఁగఁ బార్శ్వముల నైనఁ దగ వజ్రముగా
మొనచేసి నడచునది యెం
దును భీతి దనర్ప సర్వతోభద్ర మగున్. 858

సీ. కందరోన్నతశైలగహననదీతట
సంకటాయతపథశ్రాంతజనుల
క్షుత్పిపాసాపరిశోషితాత్ముల రోగ
దుర్భిక్షమరణాదిదుఃఖితులను
రిపువిద్రుతుల భూమిరేణుపంకచ్ఛన్న
జనముల బెదిరిపోయిన జనంబుఁ
బోక నిల్చిన నిద్రఁబొందిన భోజ
నవ్యగ్రత నొందినయట్టి జనులఁ
గీ. జననభూమిష్టజనుల నసంస్థితులను
నగ్నివర్షాధికవ్యసనాధికులను
జేరి నిజసైన్యజనుల రక్షింపవలయు
జనవిభుఁడు .......................... 859