పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదునొకండవ ప్రకరణము

సుబ్రహ్మణ్యము పిఠాపురము బ్రవేశించుట__ఒక మిత్రుఁడు కనc బడి యింటికిఁ గొనిపోయి యాదరించుట__నీలాద్రి రాజు చర్య__రాజు గారి ధనము పోవుట__అంజనము వేయుట__పోయినధనము నీలాద్రిరాజు దొడ్డిలో మఱికొంత సొమ్ముతోఁగూడ దొరకుట.

తల్లిదండ్రులను వీడ్కొకొని బయలుదేఱిననాఁడు సుబ్రహ్మణ్యము త్రోవతప్పి యెచ్చటికోపోయి తుద కసలసcజవేళ పిఠాపురము చేరెను. అప్పుడు కొందఱు దుష్టాత్ము లొకచోటఁ గూరుచుండి యాతని వాలకమునుజూచి తమలో దామాలోచించుకొని "యీతఁడు పల్లెటూరివాఁడుగాఁ గనఁబడుచున్నాడు. ఈతని బెదిరించి మనమే మయిన పుచ్చుకొందము" అని నిశ్చయము చేసికొనిరి. వెంటనే యా గుంపులోనుండి రాజభటుఁ డొకఁడు పైకివచ్చి ముందుకు నడిచి సుబ్రహ్మణ్యమువచ్చు మార్గమున కడ్డముగా నిలిచి గంభీర ధ్వనితో "ఆ వచ్చెడు వారెవరు?" అని అడిగెను.

సుబ్ర__నేను బ్రాహ్మణుఁడను, భీమవరమునుండి వచ్చు చున్నాను.

భటు__యింత చీఁకటి పడిన తరువాత వచ్చుటకు కారణ మేమి?

సుబ్ర__తిన్నఁగా బయలుదేఱినది మొదలుకొని నడచి వచ్చినయెడల ప్రొద్దుండగానే యూరు చేరియుందును గాని దారితప్పి పెడదారిని పడి వచ్చినందుకు వింత యాలస్యమయినది.

భటు__ఈ గ్రామములో నీకు బంధువు లెవరున్నారు?

సుబ్ర__ఎవ్వరును బంధువులు లేరు. రాజుగారి నాశ్రయించి పని సంపాదించుకోవలెనని వచ్చినాను.