ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రాధికాసాంత్వనము 29
నంచు వేగించి యా రాత్రి జననయనచకోరంబులకుఁ బండుగై యుండు పండువెన్నెలలోనఁ బయలుదేఱి మందగమనంబున రాధామందిరంబు చేరంబోవు సమయంబున,
గీ. అపుడు నచ్చట రాధ కంసారి రాక
చిలుకచే విని తనయొద్ధి చెలులఁ బిలిచి
నెన్నుఁ డిట కేగుదెంచిన విడువ వలదు
వాకిటనె నిల్పుఁడని చెప్పి పనిచె నంత. 101
వ. వారలు దేవదేవుండైన గోపాలదేవుం గనుంగొని. 102
చ. పొలతి యేమి త్రోవ విడు పోవలె నెచ్చటి కింతిచెంత కే
తొలి రుచి వీడవో విడను ద్రోతుము దొబ్బుదు పొమ్ము పొమ్ము మా
టల కెడ మౌను గాని వికటానికిఁ జొచ్చితి వౌను యెవ్వరో
బలిమి మిటారి ర మ్మిదిగొ వచ్చితి, రాకల మానవో హరీ. 108
గీ. ఇటుల నాడిన మాటల కిముడఁ బలికి
రాజసము మీఱఁగా యదురాజమౌళి
బలిమి జులుముల సందడుల్ దొలఁగఁద్రోచి
చొరవ చేసుక లోపలఁ జొచ్చువేళ. 104