పుట:Raadhika Santhvanamu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28 రాధికాసాంత్వనము

దర్పకు కోపాగ్ని దాహంబు మాన్పంగ
నలరారు నెలనీటి కొల ననంగఁ
దలిరాకువిలుకాని దాపంబు లణగింపఁ
జెలువొందు పన్నీటిచెఱు వనంగ
గీ. నాదు మన మను రాయంచ నటమటింప
చెఱకువిలుబోయ త్రవ్విన చెలమ యనఁగ
మరులు గొల్పెడు దొరసాని మరుని యిల్లు
కళలు కరగంగ ముద్దాడి కలయు టెపుడు. 99

వ. అంతట ననంతశయనుం డగు మురాంతకుండు మంతన సేసి సాత్రాజితిని వీడ్కొని యిళాదేవిం దోడితేరం దగువారల న్నియమించి మంచిలగ్నంబున రథారోహణంబు చేసి వెంబడించి వచ్చు బంధుజూలంబుల నిలువకరం బమర్చి కదలి మనోవేగంబున గోకులంబున కరుదెంచి రథంబు డిగ్గి భృత్యామాత్యాదిబంధువర్గంబుల వారి వారి విడుదులకుఁ బొమ్మని నిజగృహంబునం బ్రవేశించి నందయశోదాదులకు నమస్కరించి వార లొనరించుదీవనలు గాంచి యచటివృత్తాంతం బంతయు నెఱింగించి కొండొకతడ వందు వసియించి యచ్చటి యాప్తసఖులచే రాధికావృత్తాంతం బంతయు నాకర్ణించి యిందుల కేమి సేయువాఁడ నని చింతించి తానె పోక తీరదని నిశ్చయించి బెట్టునిట్టూర్పులు నిగుడించి మించిన దిగులునం బొగులుచు పగలు పగలాయె