36
ప్రసార ప్రముఖులు.
S. రమామోహనరావు :
రమామోహనరావు 1941 నవంబరు 10న జన్మించారు. 1967 నుండి ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా బెంగుళూరు, విజయవాడ, మదరాసు, కంద్రాలలో పనిచేసి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ (1976) అయ్యారు. ఆయన స్వయంగా మృదంగ విద్వాంసులు. అసిస్టెంట్ స్టేషన డైరక్టర్గా పదోన్నతి పొంది తిరువనంతపురం, బెంగుళూరు కేంద్రాలలో పనిచేశారు.
N. C. నరసింహాచార్యులు :
నల్లాన్ చక్రవర్తుల వంశంలో 1947 జనవరి 2న కృష్ణాజిల్లాలో జన్మించారు. ఎం. ఏ. తెలుగు పట్టభద్రులయ్యారు. 1967 నవంబర్ లో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా విజయవాడలో చేరారు. 1979లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్గా పదోన్నతి పొంది కడప, హైదరాబాద్ కేంద్రాలలో పనిచేశారు. 1993లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్గా పదోన్నతి పొంది మహారాష్ట్రలోని కొల్హాపూర్లో పనిచేశారు. 1996లో కొత్తఢిల్లీలోని ఆకాశవాణి కేంద్రానికి బదిలీ అయ్యారు. కోఆర్డినేషన్లో నరసింహాచార్యులు సిద్దహస్తులు.
బి. జి. యస్. రావ్ :
బందకవి గిరిజా శంకరరావు గోదావరి జిల్లాలో 1945 జూన్ 23న జన్మించారు. ఎం. ఏ. పట్టభద్రులై ఆకాశవాణిలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా 1967 సెప్టెంబరులో చేరారు. కడప, లే,జమ్ము, హైదరాబాదు కేంద్రాలలో 1976 నుండి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. 1993 లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్గా హైదరాబాద్ కేంద్రంలో పదోన్నతి పొందారు. ఆంగ్లంలో డెక్కన్ క్రానికల్లో చాలా వ్యాసాలు వ్రాశారు. డైరక్టరేట్లో పనిచేస్తున్న బి. ఆర్. పంతులు వీరికి సన్నిహిత బంధువులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సీనియర్ ఐ. ఏ. యస్. అధికారి బి. వి. రామారావు వీరి అగ్రజులు.
చల్లా ప్రసాదరావు :
ప్రసాదరావు కృష్ణాజిల్లాలో 1937 ఆగస్టు 19న జనించారు. విజయవాడ కేంద్రంలో ప్రోగ్రాం సెక్రటరీగా 1957లో చేరారు. క్రమంగా ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ అయి 1976లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ అయ్యారు. హైదరాబాదు కేంద్రంలో A. S. D. గా రెండేళ్ళు పనిచేసి 1995 ఆగస్టులో పదవీ విరమణచేశారు.