36
వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం
"కవులు బయలుదేరినారు. పాతకవులవంటి వారుగారు"
"కవనమున కుండవలసిన లక్షణము లన్నియు నిద్దానికి
సంపూర్ణముగ గలవు"
(యేకాంతసేవ పీఠిక. దే. కృష్ణశాస్త్రి.)
"ఈబాలకవులు తొల్లింటిస్కంధముల యశంబునకేమాత్రమును తీసిపోని యొక కొత్తస్కంధమును చేర్చబొవుచున్నారు."
(బాపిరాజతొలకరి పీఠిక - కూల్ద్రే)
"గుణమున నింతకంటె శ్రేష్ఠములైన కృతులు మనలో లేవు"
(లక్ష్మీకాంత తొలకరిపీఠిక -క.రామలింగారెడ్డి)
"యెంకిపాటలు పూర్వపురచనలకంటె వింత అందమును నూతనప్రకాశమును వెలిగక్కుచున్నవి"
(దశిక సూర్యప్రకాశరావు. భారతి)
అని యీతీరున అన్నారు. మంచిది. ఈవిషయాన్ని ఇక విచారిస్తాను. ఇంతటి ఉత్కృష్టమైనకవిత్వం నేటికాలంలో వున్నదని విన్నపుడు నాకెంతో ఆనందం కలిగింది. మిక్కిలి కుతూహలంతో ఈకవిత్వాన్ని పఠించాను. గుణదోషాలను వివరిస్తాను.
అని శ్రీమదక్కి రాజు లక్ష్మీనారాయణపుత్ర - ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో
వాఙ్మయసూత్ర పరిశిష్టంలో నూతనత్వాదికరణం.
సమాప్తం