పుట:Neti-Kalapu-Kavitvam.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నూతనత్వాధికరణం

35


"మందస్మితేన సుధియా పరిషిచ్య యా మాం
 నేత్రోత్పలైర్వికసితై రవిశం సమీపే
 సా నిత్యమంగళమయీ గృహదేవతామే
 కామేశ్వరీ హృదయతో దయితా న యాతి" (భామిని)

"బాలా యిదివరకువలె యెదురుగావచ్చి వినయంతో మన్మథుడి మంత్రులనదగిన ఆలోకనాలతో మనోహరమైన మాటలతో అయ్యో! కొంచెమయినా నన్నిప్పుడు సంతోషపెట్టవెందుకు?

ఇంద్రియార్థాలు మరచాను. దుఃఖంచేత విద్యగూడా వెనక బట్టింది. కేవలం ఒక్క నాభార్యయే లేడిపిల్లలవంటి కన్నులుగల నాభార్యయే. ఆధిదేవతవలె నాహృదయంనుండి పోదు.

"చిరునవ్వనే అమృతంతో నన్ను స్నానంజేయించి వికసించిన నేత్రోత్పలాలతో నన్నెప్పుడూ పూజిస్తున్న ఆ నిత్యమంగళమయి ఆ నాగృహదేవతాకామేశ్వరి, ఆనాప్రియురాలు నాహృదయంనుండిపొదు" అని భామినీవిలాసాంతర్గతమైన కరుణవిలాసంలో జగన్నాథవిరచిత పద్యాలు కనబడుతున్నవి.

ఈ తీరున నేను, నా, అనేపద్యాలకవిత్వం చిరకాలంనుండి వస్తున్నది. దీంట్లో యేమీకొత్తలేదు. ఇంతకూ నేను, నా, అనే యిట్లాటి కవిత్వం యొక్క ఔచిత్యం ముందు చర్చించబోతున్నాను. కనుక యిక్కడి ఆప్రశంస వదలుతున్నాను. ఇఘ మరేవిధమైన కొత్తాలేదు. యేదైనా కొత్తవుంటే అది దోషభూతం గనుక కొత్తలోచేరదని తెలపబోతున్నాను. కనుక "కొత్తకవితాప్రపంచం" "మనవారు కొత్తవారైనారు"

అని యిట్లా అనుకొనడం భ్రమ. అజ్ఞానం. అవివేకం అని చెప్పుతూ యిఘ యీకాలపుకృతులలో గుణదోషవిచారణ చేస్తాను.

నేటికాలపు కవిత్వం వెనుకటిదానికి తీసిపోదని వెనుకటికాలపు కవిత్వం కంటె ఉన్నతదశలో వున్నదని కొంద రంటున్నారు