పుట:Navanadhacharitra.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxviii

“చెలఁగి ఋగ్వేద ప్రసిద్ధుఁడై జగతి
 వెలయు హరిశ్చంద్రవిభు పుణ్యచరితఁ
 గవితాచమత్కృతిఁ గాంచి హర్షించి
 కవులందఱును శిరఃకంపంబు సేయఁ
 బచరించి వీనుల పండువుగాఁగ, రచియింతు"

నని తన కులక్రమమును జెప్పికొని, “శ్రీ కరంబుగ విరచింప నేగోరు నా కథావృత్తాంత మదియెట్టులనిన,” అని వెంటనే కథాప్రారంభమును జేసినాఁడు. పూర్వభాగాంతమున భాగాంత విశేషములను నియమములను నేమియుఁ బాటించలేదు. ఉత్తర భాగాంతమున మాత్రము-

“భ్రమరాప్రసాద సంప్రాప్త కవిత్వ
 సుమహితసామ్రాజ్య సుఖపరాయణుఁడు
 చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి
 ప్రతివాది మదగజ పంచాననుండు
 మతిమంతుఁ డయ్యల మంత్రిపుంగవుని
 సుతుఁడు గౌరనమంత్రి సుకవిశేఖరుఁడు
 కవు లెన్న నుత్తర కథ రచియించె"

అని మాత్రము చెప్పి ఫలశ్రుతితో గ్రంథమును ముగించెను. అనఁగా నీ గ్రంథరచనా సందర్భమున దేవమానవులయొక్క ప్రేరణము గాని, వారి కంకిత మిచ్చుటగాని సంభవింపలేదు. కావుననే యిది యాతని తొలి రచన యేమో యని సందేహించుట కవకాశముకలదు. కాని యిదియే యీతని బుద్ధి పరిపక్వముఁ జెందిన పిదప నొనరించిన ప్రౌడరచన యనిపించుటకుఁ దగిన నిదర్శనములును లేకపోలేదు. నవనాథ చరిత్ర రచనాసందర్భమున, మల్లికార్జున భ్రమరాంబికలను హేరంబునేగాక యిచ్చటి కథాసందర్భమున కనుకూలముగా వీరభద్రుని నందికేశ్వరుని ప్రమథగణములను సిద్ధముఖ్యులనుఁ గొల్చి, బాణాది సత్కవులకు మొక్కినాఁడు. సప్తసంతతులందును గవిత్వ మాకల్పమైన కీర్తిని గలిగించునదిగావున నేదైన నొక కథావృత్తాంతమును కావ్యముగ రచింపఁదలఁచి నట్లు చెప్పియున్నాఁడు, అంత, శ్రీశైలమఠాధిపతియగు ముక్తిశాంత భిక్షావృత్తిరాయఁడు రాజఠీవిని గొలువుండి, అవిరళ యోగ విద్యాధికులైన నవనాథవరుల పుణ్యప్రవర్తనల పరగ శ్రీగిరికవి పద్య బంధముల విరచించినాఁడది ద్విపదకావ్యముగఁ జెప్పింపవలయుఁ బ్రసిద్ధివెంపలర,

"ఇప్పుడు గల సుకవీంద్రులలోన
 సరససాహిత్య లక్షణ వివేకముల